అంతర్జాతీయ మార్కెట్లో పెరిగిన కోకో గింజల ధరకు అనుగుణంగా రైతుల కోకో గింజలకు ధర పెంచాలని కోకో రైతులు డిమాండ్ చేస్తున్నారు. 8లో u
కేంద్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని గాలికొదిలేసి వారిపై ధరల భారాన్ని మోపుతోంది. పెట్రోల్ ధరలను పెంచి రాత్రికి రాత్రే అమలులోకి తీసుకురావడం చీకటిదెబ్బగానే పరిగణించాలి. ఇటీవల 5 రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన తరువాత ధరలను పెంచడం ప్రజలను దారుణంగా మోసగించడమే.
– పంపన రవికుమార్, సీపీఎం నగర కార్యదర్శి
కేంద్రం పెంచిన పెట్రో ధరలను తక్షణం ఉపసంహరించుకోవాలి. కార్పొరేట్ సంస్థల లబ్ధి కోసమే మోదీ ప్రభుత్వం పని చేస్తోంది. బడాబాబుల ఆస్తులు పెంచుకోవడానికి, సామాన్య, మధ్య తరగతి ప్రజల చెమటను దోపిడీ చేయడానికి మోదీ ప్రభుత్వం చేస్తున్న కుటిల ప్రయత్నాలను ప్రజా ఉద్యమాల ద్వారా తిప్పికొడతాం.
– మంచెల్ల ఇస్సాకు, సీఐటీయూ నగర కార్యదర్శి


