సుబ్బారాయుడిని దర్శించుకున్న భక్తులు | - | Sakshi
Sakshi News home page

సుబ్బారాయుడిని దర్శించుకున్న భక్తులు

Nov 3 2025 6:30 AM | Updated on Nov 3 2025 6:30 AM

సుబ్బారాయుడిని  దర్శించుకున్న భక్తులు

సుబ్బారాయుడిని దర్శించుకున్న భక్తులు

సుబ్బారాయుడిని దర్శించుకున్న భక్తులు రాట్నాలమ్మకు ప్రత్యేక పూజలు

ముదినేపల్లి రూరల్‌: ప్రసిద్ధి చెందిన సింగరాయపాలెం–చేవూరుపాలెం సెంటర్లోని శ్రీసుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం భక్తులు పోటెత్తారు. సుదూర ప్రాంతాల నుంచి భారీసంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకుని స్వామివారి పుట్టలో పాలు పోసి దర్శించుకున్నారు. పాలపొంగళ్ళశాల వద్ద మహిళలు నైవేద్యాలు తయారుచేసి స్వామికి సమర్పించారు. నాగబంధాల వద్ద స్వామివారి మూర్తులను ప్రతిష్ఠించేందుకు అర్చకులతో పూజలు చేయించి ప్రతిష్ఠ తంతు నిర్వహించారు. నాగబంధాల వద్ద, గోకులంలోని గోవులకు మహిళలు పసుపు కుంకుమలతో పూజలు చేశారు. భక్తుల రద్దీకి అనుగుణంగా అన్నప్రసాద ఏర్పాట్లు చేశారు. స్వామిని దర్శించుకునే భక్తులు అన్నప్రసాదం కార్యక్రమంలో పాల్గొంటే మేలు జరుగుతుందనే విశ్వాసం ఉంది. దీంతో అన్నదాన కార్యక్రమానికి భక్తలు పోటెత్తడంతో ఆలయ సహాయ కమిషనర్‌ ఆర్‌.గంగాశ్రీదేవి ఆధ్వర్యంలో తగిన ఏర్పాట్లు చేశారు.

పెదవేగి: పెదవేగి మండలం రాట్నాలకుంటలో వేంచేసిన శ్రీ రాట్నాలమ్మకు ఆదివారం ప్రీతికరమైన రోజు కావడంతో భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కుబడులను తీర్చుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి పూజలు నిర్వహించి, తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ వారం మొత్తం రూ.26,560 ఆదాయం లభించిందని దేవస్థాన కార్యనిర్వహణాధికారి సతీష్‌కుమార్‌ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement