
ఏలూరులో వేగ జ్యూయలర్స్ ప్రారంభం
ఏలూరు (ఆర్ఆర్పేట): ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రజలకు మంచి డిజైన్ ఆభరణాలు అందించాలనే లక్ష్యంతో తమ షోరూం ఏలూరులో ప్రారంభించామని వేగ జ్యూయలర్స్ చైర్మన్ బండ్లమూడి రామ్మోహన్ అన్నారు. శుక్రవారం ఎన్ఆర్పేటలో వేగ జ్యూయలర్స్ ప్రారంభోత్సవంలో సినీ నటులు నందమూరి బాలకృష్ణ, సంయుక్త మీనన్ పాల్గొన్నారు. ఇది 5వ షోరూం అని.. ఖాతాదారుల నమ్మకానికి కట్టుబడి వ్యాపారం సాగిస్తున్నామన్నారు. షోరూం ప్రారంభం సందర్భంగా ప్రతి రూ.లక్ష కొనుగోలుపై ఉచిత బంగారు నాణెం, పాత బంగారం మార్పిడిపై గ్రాముకు రూ.100 అదనంగా చెల్లించడానికి ఏర్పాటు చేశామన్నారు. డైమండ్ ధర క్యారట్ రూ.51,999 మాత్రమేనని తెలిపారు. లక్కీ డ్రా నిర్వహించి అయిదుగురు విజేతలకు ఒక్కొక్కరికి రూ.2 లక్షల విలువైన డైమండ్ నెక్లెస్లు బహుమతిగా అందిస్తామన్నారు. కార్యక్రమంలో మేనేజింగ్ డైరెక్టర్ వనమా నవీన్ కుమార్, డైరక్టర్లు వనమా సుధాకర్, చంద్రకాంత్, చిట్లూరు నాగేశ్వరావు పాల్గొన్నారు.