
రెడ్క్రాస్ బ్లడ్ బ్యాంక్కు అవార్డు
భీమవరం (ప్రకాశంచౌక్): రెడ్క్రాస్ సొసైటీ జిల్లా శాఖ రాష్ట్రంలో అత్యధిక రక్త యూనిట్లు సేకరించిన సంస్థగా రెండో స్థానం సాధించింది. ఈ సందర్భంగా గుంటూరులోని భారతీయ విద్యాభవనన్లో జరిగిన ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. తణుకు రెడ్క్రాస్ బ్లడ్సెంటర్కు పురస్కారం లభించడం అభినందనీయమని జిల్లా శాఖాధ్యక్షుడు రామ భద్రిరాజు అన్నారు.
బస్సు ఢీకొని మహిళకు తీవ్ర గాయాలు
ఉండి: ఆసుపత్రికి వెళ్తున్న వృద్ధ దంపతులను ఆర్టీసీ బస్సు ఢీ కొట్టడంతో మహిళ తీవ్రంగా గాయపడింది. శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంపై స్థానికులు, బాధితురాలి భర్త తెలిపిన వివరాల ప్రకారం గణవరానికి చెందిన రిటైర్డ్ టీచర్ గొట్టుముక్కల గోపాలకృష్ణంరాజు తన భార్య సావిత్రితో కలసి బైక్పై భీమవరంలో ఆసుపత్రికి వెళ్తున్నాడు. ఎన్నార్పీ అగ్రహారంలోని ప్రభుత్వ పెట్రోల్ బంక్ వద్దకు రాగానే నర్సాపురం డిపోకు చెందిన బస్సు లారీని ఓవర్ టేక్ చేయబోయి బైక్ను ఢీకొట్టింది. వెనుక కూర్చున్న మహిళ పట్టుతప్పి ఆర్టీసీ బస్సు వెనక చక్రం కింద పడిపోయింది. ఇంతలో డ్రైవర్ సడన్ బ్రేక్ వేశారు. తలకు తీవ్ర గాయం కావడంతో 108లో ఆమెను ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాదస్థలికి వచ్చి వివరాలు సేకరించారు.
వివాహిత ఆత్మహత్య
ఆగిరిపల్లి: వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని వట్టిగుడిపాడులో శుక్రవారం రాత్రి జరిగింది. ఎస్సై శుభశేఖర్ వివరాల ప్రకారం వట్టిగుడిపాడుకు చెందిన రాంబాబు, నాగ తేజస్వినికి( 21) మూడేళ్ల క్రితం వివాహమైంది. ఆ సమయంలో 50 సెంట్లు కట్నంగా ఇచ్చారు. సంవత్సరం క్రితం తండ్రి కూతురి భూమి పట్టాలను బ్యాంకులో తనఖా పెట్టాడు. శుక్రవారం కూతురు తేజస్విని తండ్రి తనఖా పెట్టిన భూమిని విడిపించి ఇవ్వాలని అడగ్గా తండ్రి కొంత సమయం కావాలనడంతో తేజస్విని మనస్తాపంతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

రెడ్క్రాస్ బ్లడ్ బ్యాంక్కు అవార్డు