పోషకాల మేతతోమంచి దిగుబడి | - | Sakshi
Sakshi News home page

పోషకాల మేతతోమంచి దిగుబడి

Jun 15 2025 8:21 AM | Updated on Jun 15 2025 8:21 AM

పోషకా

పోషకాల మేతతోమంచి దిగుబడి

చింతలపూడి: పాడి పశువులకు పుష్టికరమైన మేత అందించడం వల్ల అనేక ప్రయోజనాలున్నాయి. నాణ్యమైన మేత అందించడం కారణంగా పశువుల్లో పునరుత్పత్తి సామర్థ్యం పెరుగుతుంది. పాల ఉత్పత్తి కూడ గణనీయంగా పెరుగుతుందని పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ కె.లింగయ్య తెలిపారు. సాధారణంగా పాడి పశువుల్లో విటమిన్‌ ఎ, కాల్షియం, ఫాస్పరస్‌ వంటి పోషక పదార్థాల లోపం వల్ల పునరుత్పత్తి సామర్థ్యం తగ్గుతుంది. చాలామంది రైతులు వర్షాకాలం, చలికాలంలో పచ్చిమేతలు, ఎండాకాలంలో ఎండు గడ్డిని దాణాగా అందిస్తారు. ఇది సరైన పద్ధతి కాదు. పచ్చిమేత ఎక్కువగా దొరికే కాలంలో దానికి పాతర వేసి నిల్వ చేసుకోవాలని.. అన్ని కాలాల్లో పచ్చిమేత అందుబాటులో ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు.

ఎంత మేత అవసరం..

రోజూ ఒక్కో పశువుకు 8 కిలోల వరిగడ్డి, లేదా ఎండు చొప్ప(మొక్కజొన్న, జొన్న) 8 కిలోల లెగ్యూమ్‌ జాతి పచ్చిమేత(పిల్లిపెసర, అలసంద, గోరు చిక్కుడు) 16 కిలోల గింజ జాతి పచ్చి మేతలు ఇస్తే.. పశువులకు అన్ని రకాల పోషకాలు అందుతాయి. పాల దిగుబడిని బట్టి పశువులకు దాణా అందించాలి. పోషకాలతో కూడిన గడ్డిని ఇస్తే సకాలంలో ఎదకు వస్తాయి. పాల ఉత్పత్తి కూడా అధికంగా ఉంటుంది.

గొడ్డుమోతు సమస్య ఉంటే..

పశువుల్లో గొడ్డుమోతు సమస్యకు సకాలంలో ఎదకు రాకపోవడం, గర్భకోశ వ్యాధులు, అండంలో లోపాల వల్ల ఈ సమస్య అధికంగా ఉంటుంది. పశువులు ఈనిన తరువాత పశువులు 60 నుంచి 90 రోజుల్లో ఎదకు వచ్చి చూలు కట్టాలి. ఎదకు రాని పశువులను సకాలంలో పశు వైద్యుడి దగ్గరకు తీసుకువెళ్ళి పరీక్ష చేయించాలి. ప్రతీ రోజు ఎద లక్షణాలను పరిశీలించి కృత్రిమ గర్భధారణ చేయించాలి.

దూడలకు చూడి కట్టించడం సరికాదు

యుక్త వయసు రాని దూడల్ని కత్రిమంగా చూడి కట్టించే పనిని రైతులు మానుకోవాలి. తగిన వయసు, బరువు లేని పశువుల్ని చూడి కట్టించడం వల్ల పశువుల్లో వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువ. ఆవులకు 18 నెలలు, గేదెలకు 24 నెలల వయసు వచ్చిన తరువాత మాత్రమే చూడి కట్టించాలి. ఆవులు 200 కిలోలు, గేదెలు 250–300 కిలోలు బరువు ఉన్నప్పుడు మాత్రమే చూడికట్టించాలి. శారీరకంగా పూర్తిగా ఎదగని పశువులను చూడి కట్టించడం వల్ల కటి వలయం సరైన రీతిలో నిర్మాణం కాక ఈనిక కష్టమవుతోంది. ఒక్కోసారి తల్లి లేదా దూడ లేదా రెండూ మరణించే ప్రమాదం ఉంది. అందు వల్ల రైతులు అశాసీ్త్రయమైన పద్ధతులకు స్వస్తి పలికితే పాడి పశువులు ఆరోగ్యంగా ఉంటాయని పశు వైద్యాధికారి సూచించారు.

పాడి – పంట

పోషకాల మేతతోమంచి దిగుబడి1
1/2

పోషకాల మేతతోమంచి దిగుబడి

పోషకాల మేతతోమంచి దిగుబడి2
2/2

పోషకాల మేతతోమంచి దిగుబడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement