
22న ద్విశత కవి సమ్మేళనం
సఖినేటిపల్లి: కాకినాడలో ఈ నెల 22న శ్రీశ్రీ కళావేదిక ఆధ్వర్యంలో గోదావరి కవితా పండగ కాన్సెఫ్ట్లో జాతీయ స్థాయి ద్విశత కవి సమ్మేళనం ఏర్పాటు చేసినట్లు వేదిక అంతర్జాతీయ చైర్మన్ కత్తిమండ ప్రతాప్ అన్నారు. శనివారం సఖినేటిపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు. కాకినాడ పీఆర్ కళాశాల ఆడిటోరియంలో నిర్వహించనున్న పై ద్విశత కవి సమ్మేళనంలో ఢిల్లీ, ఒడిశా, గుజరాత్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలతో పాటు, ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి రెండు వందల మందికి పైగా కవులు పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు. అలాగే ఇటీవల పర్యావరణంపై ప్లాస్టిక్ భూతం అనే అంశంపై నిర్వహించిన కవితా పోటీల్లో విజేతలకు బహుమతులు గోదావరి కవితా పండుగలో అందజేస్తామని కూడా ఆయన తెలిపారు.
చెట్టుపై నుంచి పడి వ్యక్తి మృతి
మామిడికుదురు: నగరం గ్రామంలోని తాడివారిమెరకకు చెందిన తాడి అశోక్కుమార్ (35) శుక్రవారం కొబ్బరి చెట్టుపై నుంచి పడి తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబ సభ్యులు అతన్ని రాజోలు ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా, మృతి చెందాడు. దీనిపై కేసు నమోదు చేశామని నగరం ఎస్సై ఎ.చైతన్యకుమార్ శనివారం తెలిపారు. మృతుడి భార్య నాగమణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. పెయింటర్గా పని చేసే అశోక్కుమార్ పిల్లలకు అనారోగ్యంగా ఉండడంతో బొండం కోసం చెట్టెక్కి పడిపోయి తీవ్రంగా గాయపడ్డాడన్నారు. అశోక్కుమార్ మృతితో అతని భార్య నాగమణి, 15 ఏళ్ల కుమార్తె స్వప్న, 13 ఏళ్ల కుమారుడు సంతోష్ కన్నీరు మున్నీరుగా విలపించారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.