
అనాథ మృతదేహానికి అంత్యక్రియలు
అమలాపురం టౌన్: అమలాపురం పట్టణం కలశం పార్కు వద్ద ఓ అనాథ మృతి చెందాడు. దీనిపై స్థానికులు స్పందించి పట్టణ పోలీసులకు, మున్సిపాలిటీ అధికారులకు సమాచారం ఇచ్చారు. శుక్రవారం రాత్రి మృతి చెందిన ఆ అనాథ మృతదేహాన్ని శనివారం ఉదయం అక్కడి నుంచి మున్సిపల్ పారిశుధ్య సిబ్బంది తొలగించారు. స్థానిక శ్మశాన వాటికలో ఆ మృతదేహానికి అంత్య క్రియలు నిర్వహించారు. తొలుత వైఎస్సార్ సీపీ నాయకుడు దొంగ చిన్నా, జనసేన నాయకురాలు కొప్పుల నాగమానస స్పందించి సమాచారాన్ని పోలీసులు, మున్సిపాలిటీకి అందించారు.
వ్యక్తి దుర్మరణం
మామిడికుదురు: మాకనపాలెం గ్రామంలోని ఆర్అండ్బీ రహదారిపై శనివారం ట్రాక్టర్ ఢీకొని ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మామిడికుదురు శివారు గాలిదేవరపాలేనికి చెందిన బొడ్డపల్లి సత్యనారాయణ (45) సైకిల్పై ఈదరాడ వైపు వెళ్తుండగా, అదే మార్గంలో వెళ్తున్న ట్రాక్టర్ వెనుక నుంచి ఢీకొంది. దీంతో సత్యనారాయణ మృత్యువాడ పడ్డాడు. సత్యనారాయణ వికలాంగుడు, అతను అవివాహితుడు. మృతుడి అన్నయ్య వీరాస్వామి ఫిర్యాదు మేరకు నగరం ఎస్సై ఎ.చైతన్యకుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

అనాథ మృతదేహానికి అంత్యక్రియలు