పసిప్రాయం... అభం శుభం తెలియని వయసు.. | - | Sakshi
Sakshi News home page

పసిప్రాయం... అభం శుభం తెలియని వయసు..

Sep 25 2023 2:30 AM | Updated on Sep 25 2023 12:41 PM

- - Sakshi

తూర్పు గోదావరి: పసిప్రాయం... అభం శుభం తెలియని వయసు.. ఏమైందో ఏమో పట్టుమని పదేళ్లు దాటని ఆ బాలిక ఆదివారం రాత్రి శవమై కనిపించడంతో పట్టణంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. నాలుగు రోజుల క్రితం అదృశ్యమైన బాలిక స్థానిక కట్టమూరు పుంతలో శవమై కనిపించడంతో పదేళ్లు దాటకుండానే నిండు నూరేళ్లు నిండిపోయాయా అంటూ తల్లి జ్యోతి విలపించిన తీరు చూపరులకు కంటతడి పెట్టించింది.

ఘటనకు సంబంధించి వివరాల్లోకి వెళితే... స్థానిక ఎన్‌టీఆర్‌ నగర్‌లో ఉంటున్న బాలిక తల్లి పదేళ్ల కుమార్తె ప్రవీణకుమారి కనిపించడం లేదని ఈ నెల 20వ తేదీన పెద్దాపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఆదివారం సాయంత్రం కట్టమూరు పుంత శివారులో కుళ్లిపోయిన స్థితిలో ఉన్న ఓ బాలిక మృతదేహాన్ని కనుగొన్నారు.

ఆ మృతదేహం ఎవరిది అనే కోణంలో విచారణ చేయగా బాలిక ఒంటిపై ఉన్న దుస్తుల ఆధారంగా నాలుగు రోజుల కిందట అదృశ్యమైన బాలికగా గుర్తించారు. దీంతో ఆ చిన్నారి తల్లిదండ్రులను పిలిపించి బాలిక మృతదేహం ప్రవీణకుమారిగా నిర్ధారించారు. సమీప బంధువే హత్య చేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. సీఐ నబీ పర్యవేక్షణలో ఎస్‌ఐ సురేష్‌కుమార్‌ దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement