మరో 20 రోజుల్లో పెళ్లి.. ఇంతలోనే ఘోరం.. ఆ ఇంట తీవ్ర విషాదం | Young Man Died In Road Accident In Kurnool District | Sakshi
Sakshi News home page

మరో 20 రోజుల్లో పెళ్లి.. ఇంతలోనే ఘోరం.. ఆ ఇంట తీవ్ర విషాదం

Jan 27 2023 10:32 AM | Updated on Jan 27 2023 10:32 AM

Young Man Died In Road Accident In Kurnool District - Sakshi

కాగా అరుణ్‌పాండుకు మద్దికెర గ్రామానికి చెందిన ఓ యువతితో పెళ్లి నిశ్చయమైంది. మరో 20 రోజుల్లో పెళ్లి జరగాల్సి ఉంది.

ఆదోని అర్బన్‌(కర్నూలు జిల్లా): పెళ్లి పీటలు ఎక్కాల్సిన యువకుడు మృత్యు ఒడి చేరాడు. మరో ఇరవై రోజుల్లో పెళ్లి ఉందనగా.. గుర్తు తెలియని వాహనం రూపంలో మృత్యువు కబళించింది. ఈ దుర్ఘటన గురువారం సాయంత్రం పెద్దహరివాణం గ్రామ సమీపంలో చోటు చేసుకుంది.

తల్లిదండ్రులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఎమ్మిగనూరు మండలం గుడికంబాల గ్రామానికి చెందిన హేమాద్రి, రేణుక దంపతుల మొదటి కుమారుడు అరుణ్‌పాండు (24) శిరుగుప్పలోని ఓ ఫర్టిలైజర్స్‌ దుకాణంలో పనిచేస్తున్నాడు. రోజూ లాగే గురువారం కూడా విధులు ముగించుకొని గ్రామానికి వస్తుండగా.. పెద్దహరివాణం వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి వెళ్లిపోయింది.
చదవండి: వివాహేతర సంబంధం.. ప్రియుడికి ఊహించని షాక్‌ ఇచ్చిన ప్రియురాలు

దీంతో క్షతగాత్రుడిని స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌లో ఆదోని ఏరియా ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. కాగా అరుణ్‌పాండుకు మద్దికెర గ్రామానికి చెందిన ఓ యువతితో పెళ్లి నిశ్చయమైంది. మరో 20 రోజుల్లో పెళ్లి జరగాల్సి ఉంది. ఇంతలోనే ఘోరం జరిగిపోయిందని తల్లిదండ్రులు, బంధువులు రోదిస్తున్న తీరు స్థానికులను కలచివేసింది.  కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.      

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement