యువతి పరిచయం.. భార్యకు విడాకులు ఇచ్చేశానని నమ్మబలికి..

Young Man Cheating On Woman In The Name Of Marriage In Visakhapatnam - Sakshi

సాక్షి, విశాఖపట్నం: తనను వివాహం చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని విశాఖకు చెందిన యువకుడిపై పూణే పోలీసులకు ఇటీవల ఓ యువతి ఫిర్యాదు చేసింది. బాధితురాలు చెప్పిన వివరాల ప్రకారం.. ఆరేళ్ల క్రితం పూణేలో జర్మనీ లాంగ్వేజ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో సదరు యువతికి విశాఖ నగరం మర్రిపాలేనికి చెందిన సుధీర్‌ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. అప్పటికే ఆమెకు వివాహమై మూడేళ్లయింది.

చదవండి: సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ ఆత్మహత్య.. సహోద్యోగికి ఫోన్‌ చేసి..

తనకూ వివాహమైందని, తన భార్యకు విడాకులు ఇచ్చేశానని నమ్మబలికి ఆమెకు దగ్గరయ్యాడు. ఇప్పుడు ఆమె మూడు నెలల గర్భిణి. ఇదిలా ఉండగా తనను మోసం చేసి రహస్యంగా ఈ నెల 19న సింహాచలంలో మరో యువతిని వివాహం చేసుకున్నాడని బాధిత యువతి ఫిర్యాదులో పేర్కొంది. దీనిపై నగర పోలీసులను సంప్రదించగా.. తమకు ఎటువంటి సమాచారం రాలేదని వెల్లడించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top