జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల కుట్ర భగ్నం

Terror Attack Averted In Jammu And Kashmir - Sakshi

న్యూఢిల్లీ : జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదుల కుట్ర భగ్నమైంది. దేశ స్వాతంత్ర్య వేడుకల సందర్భంగా బాంబు దాడులకు ప్లాన్‌ చేసిన నలుగురు ఉగ్రవాదులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. జైసే ఈ మహ్మద్‌ ఉగ్రవాద సంస్ధకు చెందిన వీరు శనివారం పట్టుబడ్డారు. ఈ నలుగురు డ్రోన్ల ద్వారా ఆయుధాలను సేకరించి మిగిలిన ఉ‍గ్రవాదులకు సరఫరా చేయటానికి ప్రయత్నిస్తున్నట్లు.. టూవీలర్‌కు ఐఈడీ అమర్చి పేలుళ్లు జరపాలని కుట్ర పన్నినట్లు తేలింది. ఆదివారం స్వాంతంత్ర్య వేడుకల సందర్భంగా దేశ వ్యాప్తంగా పలు ప్రదేశాల్లో బాంబు దాడులకు సిద్ధమైనట్లు గుర్తించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top