చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం | Road Accident At Chittoor District | Sakshi
Sakshi News home page

చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం

Aug 30 2020 11:10 AM | Updated on Aug 31 2020 3:28 PM

Road Accident At Chittoor District - Sakshi

సాక్షి, చిత్తూరు : జిల్లాలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో నలుగురు ద్మురణం చెందారు. బంగారుపాళెం మండలం మొగలి వద్ద ఇవాళ ఉదయం ఓ కారు ఆగిఉన్న లారీని ఢీకొట్టింది. ఎదురుగా వచ్చిన టీవీఎస్‌ మోపెడ్‌ను చూసిన వెంటనే వేగాన్ని నియంత్రించలేకపోవడంతో అదుపు తప్పి లారీని ఢికొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ముగ్గురు, బైక్‌పై వెళుతున్న వ్యక్తి మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు మృతులు బెంగుళూరుకు చెందిన వారు. వీరంతా బెంగళూరు నుంచి నెల్లూరుకు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులు శ్రీనివాసులు, రత్నమ్మ, వెంకటేష్‌గా పోలీసులు గుర్తించారు. మరొకరు చిత్తూరు జిల్లాకు చెందిన వ్యక్తి. పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement