Man Died In Road Accident At Madhapur - Sakshi
Sakshi News home page

Hyderabad: మాదాపూర్‌లో ఘోర రోడ్డుప్రమాదం

Oct 3 2021 10:01 AM | Updated on Oct 17 2021 1:05 PM

Man Deceased In Road Accident At Madhapur - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మాదాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఆదివారం ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరోకరికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకెళ్తే.. ద్విచక్రవాహనంపై భాగ్యనగర్‌ సొసైటీ వైపు వెళ్తున్న ఇద్దరు యువకులు అక్కడ పోలీసులు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్నారన్న విషయాన్ని గమనించారు.

పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో ఎన్‌ఐఏ వద్ద అతివేగంగా వెళ్తూ కార్‌ను ఢీ కొట్టారు. దీంతో బైక్‌ నడుపుతున్న గణేష్‌ రాజు తీవ్రంగా గాయపడ్డాడు. వెనుక కూర్చున్న అతని సోదరుడు చైతన్య వర్మ ప్రమాదస్థలంలోనే కన్నుమూశాడు. గణేష్‌ రాజును ఆస్పత్రికి తరలించారు. కారు డ్రైవర్‌రాజేష్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. తూర్పుగోదావరి జిల్లాలోని రాజోలు మండల మల్కిపురంకు చెందిన వీరు బోరబండ వివేకానంద నగర్‌లో పెదనాన్న రాజు ఇంటిలో నివాసం ఉంటున్నారు. మృతుడు శంకర్‌పల్లెలో ఉన్న ఐబీఎస్‌ కాలేజీలో బీబీఎమ్‌ చదువుతుండగా.. గాయపడిన గణేష్ రాజు పంజాగుట్టలోని ఎమిటీ కాలేజీలో బీబీఎమ్‌ చదువుతున్నారు.  

చదవండి: (Rave Party: ముంబై తీరంలో రేవ్‌ పార్టీ.. ఎన్‌సీబీ అదుపులో షారుఖ్‌ కొడుకు?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement