టీటీడీ, ఏపీ ప్రభుత్వంపై దుష్ప్రచారం.. 18 మందిపై కేసు | Andhra Pradesh Police Action Against Social Media Posts | Sakshi
Sakshi News home page

టీటీడీ, ఏపీ ప్రభుత్వంపై దుష్ప్రచారం.. 18 మందిపై కేసు

Aug 13 2021 7:47 PM | Updated on Aug 13 2021 8:57 PM

Andhra Pradesh Police Action Against Social Media Posts  - Sakshi

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, తిరుమల తిరుపతి దేవస్థానంపై దుష్ప్రచారం చేస్తున్న 18 మందిపై కేసులను నమోదు చేసినట్లు ఏపీ పోలీసులు తెలిపారు. కాగా, టీటీడీ దేవస్థానానికి చెందిన 1500 కేజీల బంగారాన్ని తాకట్టుపెట్టి.. ఏపీ ప్రభుత్వం అప్పుతీసుకున్నట్లు కొంత మంది సోషల్‌ మీడియాలో పోస్ట్‌లు పెట్టారు.

ప్రభుత్వ ప్రతిష్ఠను దిగజార్చేలా వ్యవహరించడం పట్ల పోలీసులు దీన్ని తీవ్రంగా పరిగణించారు. అయితే, 18 మంది నిందితులపై కేసులను నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement