– 8లో
– 8లో
తల్లికి వందనం పథకాన్ని అమలుచేయడానికి క్షేత్రస్థాయిలో సాంకేతిక చిక్కులు ఎదురవుతున్నాయి.
కాణిపాకం ఆలయంలో ఈఓ తనిఖీలు
కాణిపాకం: కాణిపాకంలోని శ్రీ స్వయంభు వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానంలో ఈఓ పెంచల కిషోర్, ఆలయ బోర్డు సభ్యులు కలిసి శనివారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కళ్యాణకట్ట, మరుగుదొడ్ల వద్ద పరిశుభ్రతను పరిశీలించిన ఈఓ, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిరంతరం శుభ్రంగా ఉంచాలని సిబ్బందిని ఆదేశించారు. అనంతరం నిత్య అన్నదాన భవనాన్ని సందర్శించి, భక్తులకు స్వయంగా అన్నం వడ్డించారు. భోజనం రుచి, నాణ్యతపై భక్తులతో నేరుగా మాట్లాడి అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత అన్నదాన విరాళాల కౌంటర్ను కూడా ఆయన తనిఖీ చేశారు. పవిత్రమైన ఆలయంలో విధుల్లో నిర్లక్ష్యం వహించినా, అక్రమాలకు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని సిబ్బందిని ఘాటుగా హెచ్చరించారు.


