చిత్తూరు కలెక్టరేట్ : సమస్యలు పరిష్కరించండి సారూ..! అంటూ అర్జీదారులు వేడుకున్నారు. సోమవారం కలెక్టరేట్లో పీజీఆర్ఎస్ రద్దయినప్పటికీ పలు ప్రాంతాల నుంచి అర్జీదారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. పీజీఆర్ఎస్ లేకపోవడంతో వెనుదిరిగారు.
ఆక్రమించేందుకు కుట్ర
నగరంలోని ఇరువారం గ్రామంలో తమ అనుభవంలో ఉన్న స్థలాన్ని ఆక్రమించేందుకు కొందరు స్థానికులు కుట్ర చేస్తున్నారని బాధితురాలు మేరీ ఆరోపించారు. గతంలో అధికారులు విచారణ జరిపి దురాక్రమణలను తొలగించినప్పటికీ, మళ్లీ ఆక్రమణలకు ప్రయత్నిస్తున్నారని ఆమె పేర్కొన్నారు.


