రైలు మార్గం దిండివనం, వెల్లిమేడుపేట, తెల్లార్, వంధవాసి, మాంబాక్కం, ఎరుమైవెట్టి, చెయ్యార్, ఇరుంగూర్, మామండూరు, ఆరణి, తామరైపాక్కం, తిమిరి, ఆర్కాట్, రాణిపేట నుంచి వాలాజా రోడ్డు జంక్షన్న్ మీదుగా కొడక్కల్, షోళింగర్, ఆర్కే పేట, అత్తిమాంజేరిపేట, పళ్లిపట్టు, పొదటూరుపేట మీదుగా నగరి వరకు చేరుకుంటుంది. ఆంధ్రప్రదేశ్లోని నగరి వెళ్లేలా ప్లాన్న్ చేశారు. ఈ మార్గంలో 3 జంక్షన్లు, 13 క్రాసింగ్లు, 9 హాల్టులు ఉండే విధంగా పథకరచన చేశారు. 22 స్టేషన్లలో 18 కొత్తస్టేషన్లు రానున్నాయి. 26 మేజర్ వంతెనలు, 200 మైనరు వంతెనలు నిర్మించనున్నారు.


