శ్రీసిటీ మ్యాంగో రిసార్ట్‌కు పురస్కారం | - | Sakshi
Sakshi News home page

శ్రీసిటీ మ్యాంగో రిసార్ట్‌కు పురస్కారం

Sep 29 2025 8:09 AM | Updated on Sep 29 2025 10:38 AM

-

శ్రీసిటీ(సత్యవేడు) : ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ పర్యాటక రంగం ఎంపిక చేసిన 2024–25 పర్యాటక ఎక్సలెన్సీ అవార్డులలో ‘ఉత్తమ థీమ్‌–బెస్ట్‌ రిసార్ట్‌’ అవార్డును శ్రీసిటీ మ్యాంగో రిసార్ట్‌ అందుకుంది. ఇక్కడ అమలు చేస్తున్న స్థిరమైన ఆకర్షణీయమైన అతిథ్య సేవలకు గాను ఈ గుర్తింపు దక్కింది. శుక్రవారం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన ప్రపంచ పర్యాటక దినోత్సవం–25 సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు , పర్యాటక శాఖ మంత్రి దుర్గేష్‌ , సీనియర్‌ ప్రభుత్వ అధికారులు హాజరైన కార్యక్రమంలో ఈ అవార్డును ప్రదానం చేశారు. 

మ్యాంగో రిసార్ట్‌ తరఫున రిసార్ట్‌ జనరల్‌ మేనేజర్‌ శ్రీనివాసరావు ఈ అవార్డును స్వీకరించారు. శ్రీసిటీలోని సుందర సువిశాల ప్రాంతంలో ఉన్న మ్యాంగో రిసార్ట్‌ 20 లగ్జరీ కాటేజీలు, 10 సాధారణ గదులను కలిగి ఉంది. ఇక్కడ బస చేసే అతిథులు మంచి ప్రకృతిని వీక్షించడంతో పాటు కయాకింగ్‌, ట్రెక్కింగ్‌, సైక్లింగ్‌ పక్షలను వీక్షించడం వంటి వివిధ రకాల కార్యకలాపాలను ఆస్వాదించవచ్చు. శ్రీసిటీ మ్యాంగో రిసార్ట్‌కు వరుసగా రెండవ సారి అవార్డు దక్కడం విశేషంగా చెప్పవచ్చు. రీసార్టును తీర్చిదిద్దిన విధానాన్ని ప్రశంసించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement