
అక్రమ క్వారీల ఆగడాలను నివారించాలి
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని పాలసముద్రం మండలంలో అక్రమ క్వారీల ఆగడాలను నివారించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి నాగరాజు డిమాండ్ చేశారు. ఆయన గురువారం ఆ పార్టీ నాయకులతో కలిసి కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. ఆయన మాట్లాడుతూ పాలసముద్రంలో గుట్టలను తవ్వి గ్రావెల్ను యథేచ్ఛగా తమిళనాడుకు తరలిస్తున్నారని ఆరోపించారు. తద్వారా రూ.లక్షలు ఆర్జిస్తున్నారని దుయ్య బట్టారు. ఈ విషయం తెలిసినా రెవెన్యూ, మైనింగ్ శాఖల అధికారులు ఎందుకు చర్య లు తీసుకోవడం లేద ని నిలదీశారు. లీజు అనుమతికి మించి గ్రా వెల్ను తవ్వేస్తున్నారని ఆరోపించారు. కలెక్టర్ జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు.

అక్రమ క్వారీల ఆగడాలను నివారించాలి