ఆదిశక్తి అలంకరణలో వరాలతల్లి | - | Sakshi
Sakshi News home page

ఆదిశక్తి అలంకరణలో వరాలతల్లి

Sep 25 2025 7:15 AM | Updated on Sep 25 2025 7:15 AM

ఆదిశక్తి అలంకరణలో వరాలతల్లి

ఆదిశక్తి అలంకరణలో వరాలతల్లి

చౌడేపల్లె : బోయకొండ గంగమ్మ ఆలయంలో నిర్వహిస్తున్న దసరా మహోత్సవాల్లో భాగంగా రెండవ రోజైన బుధవారం అమ్మవారు ఆదిశక్తి పార్వతీదేవి అలంకారంలో భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. అనంతరం విశేషాభరణాలతో పార్వతీదేవిగా అలంకరించి పూజలు నిర్వహించారు. వేదపండితులు గోవర్ధనశర్మ, తదితర అర్చక బృందం ఉత్సవమూర్తి ఎదుట ఈఓ ఏకాంబరం, ఉభయదారులతో కలిసి హోమ పూజలు చేశారు. కార్యక్రమానికి జిఆర్‌ఎస్‌రమణ ( బోయకొండ), ఎం. వేణుగోపాల్‌రెడ్డి, సుగుణ (తిరుపతి) రామచంద్రయ్య, క్రిష్ణవేణి (సోమల) గురుప్రసాద్‌, గుణ నేత్ర ( బెంగళూరు) రాఘవేంధ్ర, మమత (చిక్‌బల్లాపురం) చంద్రశేఖర్‌రెడ్డి,దుర్గ ( రామాపురం వైఎస్సార్‌ కడప) వారు ఉభయదారులుగా వ్యవహరించారు. ఆలయంలో గణపతి పూజ, అభిషేకాలు, అర్చనలు, ఊంజల్‌సేవ, హోమం, చండీ హోమం, పూర్ణాహుతి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement