ఈ ఆస్పత్రికి బిడ్డలను తెస్తే బతకడంలే! | - | Sakshi
Sakshi News home page

ఈ ఆస్పత్రికి బిడ్డలను తెస్తే బతకడంలే!

Apr 11 2025 2:38 AM | Updated on Apr 11 2025 2:38 AM

ఈ ఆస్పత్రికి బిడ్డలను తెస్తే బతకడంలే!

ఈ ఆస్పత్రికి బిడ్డలను తెస్తే బతకడంలే!

● ఏరియా ఆస్పత్రిలో మూడు నెలల చిన్నారి మృతి ● వైద్యుల నిర్లక్ష్యమేనని తల్లిదండ్రుల ఆరోపణ

పలమనేరు: ‘ఈ ఆస్పత్రికి బిడ్డలను తీసుకుని ఎప్పుడొచ్చినా ప్రాణాలతో బతకడం లేదు. ఇప్పుడు మా బిడ్డ, అంతకుముందు మా బామ్మర్థి బిడ్డ.. ప్రభుత్వాస్పత్రంటే ప్రాణాలను కాపాడాలిగానీ.. ఇలా చంపేస్తుంటే ఎలాగా?.’ అని ఆ తల్లిదండ్రులు ఆస్పత్రి వద్ద బిడ్డ శవాన్ని వడిలో పెట్టుకుని రోదిస్తుంటే అక్కడున్నవారు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ సంఘటన పలమనేరు ప్రభుత్వ ఏరియాస్పత్రిలో గురువారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పలమనేరు మండలంలోని టి.వడ్డూరు గ్రామానికి చెందిన గణేష్‌ కుమార్తె (3 నెలల పసికందు)కు శ్వాస ఆడడంలేదని స్థానిక ఆస్పత్రికి గురువారం ఉదయం తీసుకొచ్చారు. ఆ శిశువు పరిస్థితి విషమంగా ఉండడంతో వెంటనే ఆస్పత్రిలోని ఎన్‌బీఎస్‌యూకు తరలించారు. అక్కడ ఆక్సిజన్‌ పెట్టి, బేసిక్‌ లైఫ్‌ సపోర్ట్‌ కోసం సీపీఆర్‌ కూడా చేశారు. కానీ ఆ పసికందును బతికించలేకపోయారు. తల్లిపాలు పట్టించేటపుడు చిన్నారికి పొరపోయి పాలు ఊపిరితిత్తుల్లోకి చేరడంతో శ్వాస ఆడకుండాపోయిందని వైద్యులు చెబుతున్నారు. అయితే తల్లిదండ్రులు మాత్రం ఇక్కడి వైద్యుల నిర్లక్ష్యమే తమ బిడ్డ మృతికి కారణమని ఆరోపిస్తున్నారు. ఈ విషయమై ఆస్పత్రిలోని వైద్యులు డాక్టర్‌ యుగంధర్‌ మాట్లాడుతూ ఆ చిన్నారికి ఆరోగ్యం బాగోలేక తల్లిదండ్రులు చిత్తూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్సలు చేయించి ఇంటికి తీసుకొచ్చారన్నారు. ఉన్నట్టుండి శ్వాస ఆడకపోవడంతో ఇక్కడికి తీసుకొచ్చారని, తాము అన్ని రకాలుగా ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నించామని తమ నిర్లక్ష్యం ఏమీ లేదన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement