
దేశంలో ఎక్కువమంది ప్రయాణించే రవాణా వ్యవస్థ రైల్వేలు. నిత్యం కోట్లాదిమంది రైళ్లలో వివిధ గమ్యస్థానాలకు ప్రయాణిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో సాధారణ రైలు సర్వీస్లతోపాటు ప్రత్యేక టూర్ ప్యాకేజీలను సైతం రైల్వే శాఖ అందిస్తోంది. ఇందులో భాగంగా ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) ప్రయాణికుల కోసం కొత్త డిజిటల్ పేమెంట్ సదుపాయాన్ని ప్రవేశపెట్టింది. 'ఈపేలేటర్' పేరుతో అందుబాటులోకి వచ్చిన ఈ స్కీమ్ ద్వారా ప్రయాణికులు రైలు, విమాన టికెట్లను బుక్ చేసుకుని తర్వాత ఎలాంటి వడ్డీ లేకుండా చెల్లించవచ్చు.
ఈపేలేటర్ ఆప్షన్ వెబ్సైట్, మొబైల్ యాప్ రెండింటిలోనూ అందుబాటులో ఉంది. దేశీయ, అంతర్జాతీయ విమాన టిక్కెట్లు, టూర్ ప్యాకేజీలను ఈ ఆప్షన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. అంతేకాక, తత్కాల్ టికెట్లను బుక్ చేయడానికి కూడా ఈ సేవను ఉపయోగించుకోవచ్చు. ప్రయాణికులు ఎలాంటి వడ్డీ లేకుండా 14 రోజుల్లో చెల్లించవచ్చని ఐఆర్సీటీసీ తెలిపింది.
ఈపేలేటర్ సేవను పొందే ప్రక్రియ
తక్షణ, చెల్లింపు రహిత బుకింగ్ ప్రయోజనాలను పొందే ప్రక్రియ సాధారణ బుకింగ్ మాదిరిగానే సులభంగా ఉంటుంది.ఐఆర్సీటీసీ అందించే రైలు, విమానం లేదా టూర్ ప్యాకేజీలను ప్రయాణికులు ఎంచుకోవాల్సి ఉంటుంది.
పేమెంట్ పేజీలోకి వెళ్లిన తర్వాత ప్రయాణికులు 'ఈపేలేటర్' ఆప్షన్ను ఎంచుకుని బుకింగ్ను కన్ఫర్మ్ చేసుకోవచ్చు. కార్డు వివరాలు లేదా వాలెట్ బ్యాలెన్స్ అవసరం లేదు.