గత వారం చివరలో నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. ఈ రోజు ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. ట్రేడింగ్ ప్రారంభమయ్యే సమయానికి సెన్సెక్స్ 53.56 పాయింట్ల స్వల్ప లాభంతో 66023.6 పాయింట్ల వద్ద, నిఫ్టీ 35.25 పాయింట్ల లాభంతో 19830.70 పాయింట్ల వద్ద కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ రెండూ కూడా ఈ రోజు శుభారంభం పలికాయి.
టాప్ గెయినర్స్ జాబితాలో అదానీ ఎంటర్ప్రైజెస్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL), అదానీ పోర్ట్స్, హిందాల్కో, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ ఉన్నాయి. అపోలో హాస్పిటల్, విప్రో, హెచ్సీఎల్ టెక్నాలజీస్, టీసీఎస్, బ్రిటానియా కంపెనీలో నష్టాల బాటలో సాగుతున్నాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు)