
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ఉక్కు దిగుమతులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజా సుంకాల ఆందోళనల మధ్య భారత బెంచ్మార్క్ సూచీలు బీఎస్ఈ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ నిఫ్టీలు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. దీనికి తోడు దేశంలో పెరుగుతున్న కోవిడ్ -19 కేసులు, ఎఫ్ఐఐల అమ్మకాలు, రష్యా, ఉక్రెయిన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు, ఆర్బీఐ ద్రవ్య విధాన ఫలితాలకు ముందు భయాందోళనలు సోమవారం సెంటిమెంట్ను ప్రభావితం చేశాయి.
బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 581 పాయింట్లు లేదా 0.71 శాతం క్షీణించి 80,870 వద్ద ఉండగా, నిఫ్టీ 50 సూచీ 165 పాయింట్లు లేదా 0.67 శాతం క్షీణించి 24,586 వద్ద ప్రారంభమైంది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎల్అండ్టీ, టాటా స్టీల్, హెచ్సీసీఎల్ టెక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, బజాజ్ ఫైనాన్స్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్ర, భారతీ ఎయిర్టెల్, కొటక్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, టాటా మోటార్స్ షేర్లు 1.7 శాతం వరకు నష్టపోయాయి. మరోవైపు హెచ్యూఎల్, అదానీ పోర్ట్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, నెస్లే ఇండియా, ఎస్బీఐ నష్టాల నుంచి తప్పించుకున్నాయి.
విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్, నిఫ్టీ స్మాల్ క్యాప్ సూచీలు 0.3 శాతం చొప్పున క్షీణించాయి. ఫియర్ గేజ్ ఇండియా వీఐఎక్స్ ప్రారంభ డీల్స్ లో 8 శాతం పెరిగింది. రంగాలవారీగా చూస్తే నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 1 శాతానికి పైగా, నిఫ్టీ మెటల్ ఇండెక్స్ 0.9 శాతం నష్టపోయాయి. నిఫ్టీ పీఎస్యూ బ్యాంక్ ఇండెక్స్ 1.16 శాతం పెరిగింది.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)