మంగళవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 1,456.04 పాయింట్లు లేదా 1.92 శాతం నష్టంతో 74,559.24 వద్ద, నిఫ్టీ 436.30 పాయింట్లు లేదా 1.83 శాతం నష్టంతో 23,379.55 వద్ద నిలిచాయి.
బటర్ఫ్లై గాంధీమతి అప్లయన్సెస్ లిమిటెడ్, ఏషియన్ స్టార్ కంపెనీ లిమిటెడ్, జాగల్ ప్రీపెయిడ్ ఓషన్ సర్వీసెస్ లిమిటెడ్, సెమాక్ కన్స్ట్రక్షన్ లిమిటెడ్, సాస్కెన్ టెక్నాలజీస్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. డైనమిక్ కేబుల్స్ లిమిటెడ్, ప్రేమ్కో గ్లోబల్ లిమిటెడ్, జీఏసీఎం టెక్నాలజీస్ లిమిటెడ్, మనోరమ ఇండస్ట్రీస్ లిమిటెడ్, రీగల్ రిసోర్సెస్ లిమిటెడ్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.
Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.


