దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 సూచీ 42.80 పాయింట్లు లేదా 0.18 శాతం నష్టంతో 24,049.90 వద్ద ప్రారంభమైంది. బీఎస్ఈ సెన్సెక్స్ మంగళవారం ట్రేడింగ్ సెషన్ ను 208.84 పాయింట్లు లేదా 0.27 శాతం తగ్గి 77,094.79 వద్ద ప్రారంభించింది.
విస్తృత మార్కెట్లలో, నిఫ్టీ మిడ్ క్యాప్ 100, నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 సూచీలు వరుసగా 0.24 శాతం, 0.64 శాతం పెరిగాయి.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)


