ట్రంప్ ప్రకటన: ఒక్కసారిగా మారిపోయిన స్టాక్ మార్కెట్లు | Nifty 25000 Points Hike First in 2025 | Sakshi
Sakshi News home page

ట్రంప్ ప్రకటన: ఒక్కసారిగా మారిపోయిన స్టాక్ మార్కెట్లు

May 16 2025 7:10 AM | Updated on May 16 2025 8:48 AM

Nifty 25000 Points Hike First in 2025

ఖతార్‌లో పర్యటిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ గురువారం మధ్యాహ్నం... ‘‘భారత్‌ ఒక వాణిజ్య ఒప్పందాన్ని ప్రతిపాదించింది. దీని ప్రకారం అనేక అమెరికా ఉత్పత్తులపై ప్రాథమికంగా సున్నా టారిఫ్‌లు ఉంటాయి’’ అన్నారు. ట్రంప్‌ ప్రకటనతో మార్కెట్లో సెంటిమెంట్‌ ఒక్కసారిగా మారిపోయింది. మిడ్‌సెషన్‌ వరకు ఫ్లాట్‌గానే కదలాడిన సూచీలు భారీ లాభాలు నమోదు చేశాయి.

ఇరాన్‌తో అమెరికా అణు ఒప్పందం కుదిరే అవకాశం నేపథ్యంలో సరఫరా పెరుగుతుందనే అంచనాలతో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గాయి. భారత్‌కు దిగుమతయ్యే బ్రెంట్‌ క్రూడాయిల్‌ బ్యారెల్‌ ధర 3.50% తగ్గి 63.79 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. రిటైల్‌ ద్రవ్యోల్బణం అరేళ్ల కనిష్టానికి చేరుకోవడంతో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కీలక వడ్డీ రేట్లు తగ్గించే అవకాశాలు మరింత బలపడ్డాయి.

ఇదీ చదవండి: మరింత తగ్గుతున్న గోల్డ్ రేటు: ఆల్‌టైమ్‌ గరిష్టాల నుంచి..

వరుస మూడు నెలల అమ్మకాల అనంతరం విదేశీ ఇన్వెస్టర్లు ఏప్రిల్‌ 15 నుంచి భారతీయ ఈక్విటీలలో దాదాపు రూ.50 వేల కోట్లు పెట్టుబడి పెట్టారు. గత 20 సెషన్లలో 19 సార్లు నికర కొనుగోలుదారులుగా నిలిచారు. ఎఫ్‌ఐఐల వరుస కొనుగోళ్లు మన సూచీల ర్యాలీకి దన్నుగా నిలిచాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement