ఐపీవో బాటలో ఎల్‌సీసీ ప్రాజెక్ట్స్‌ | LCC Projects files draft papers with Sebi | Sakshi
Sakshi News home page

ఐపీవో బాటలో ఎల్‌సీసీ ప్రాజెక్ట్స్‌

Feb 24 2025 6:35 AM | Updated on Feb 24 2025 8:01 AM

LCC Projects files draft papers with Sebi

సెబీకి ప్రాస్పెక్టస్‌ దాఖలు

న్యూఢిల్లీ: ఈపీసీ సంస్థ ఎల్‌సీసీ ప్రాజెక్ట్స్‌ పబ్లిక్‌ ఇష్యూకి రానుంది. ఇందుకు వీలుగా క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్‌ దాఖలు చేసింది. వీటి ప్రకారం ఐపీవోలో భాగంగా రూ. 320 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో .29 కోట్ల షేర్లను ప్రమోటర్లు విక్రయానికి ఉంచనున్నారు. 

ఈక్విటీ జారీ నిధులను పరికరాల కొనుగోలు, రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు వినియోగించనుంది. కంపెనీ ప్రధానంగా నీటి పారుదల, నీటి సరఫరా ప్రాజెక్టుల విభాగాలలో ఇంజినీరింగ్, ప్రొక్యూర్‌మెంట్, కన్‌స్ట్రక్షన్‌(ఈపీసీ) సేవలు అందిస్తోంది. రెండు దశాబ్దాల కాలంలో కంపెనీ ఆనకట్టలు, బ్యారేజీలు, హైడ్రాలిక్‌ స్ట్రక్చర్లు, లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పనులు తదితర ప్రాజెక్టులను పూర్తి చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement