ఈక్విటీ ఎంఎఫ్‌లకు ఫిబ్రవరిలో రూ.26,866 కోట్లు | Equity mutual funds in February saw a 23 per cent net rise in inflows to Rs 26,865.78 crore | Sakshi
Sakshi News home page

ఈక్విటీ ఎంఎఫ్‌లకు ఫిబ్రవరిలో రూ.26,866 కోట్లు

Mar 9 2024 2:31 AM | Updated on Mar 9 2024 2:31 AM

Equity mutual funds in February saw a 23 per cent net rise in inflows to Rs 26,865.78 crore - Sakshi

న్యూఢిల్లీ: ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్ల (ఎంఎఫ్‌)లోకి ఈ ఏడాది ఫిబ్రవరిలో రూ.26,866 కోట్ల పెట్టుబడులు వచ్చాయని భారత మ్యూచువల్‌ ఫండ్‌ల సంఘం (యాంఫీ) గణాంకాలు వెల్లడించాయి. ఒక నెలలో ఈ స్థాయిలో పెట్టుబడులు పెట్టడం గడిచిన 23 ఏళ్లలో గరిష్టం.

ఈ జనవరిలో వెల్లువెత్తిన రూ.21,721 కోట్లతో పోలిస్తే కూడా 23% అధికం. కొత్త ఫండ్ల ఆవిష్కరణ, థీమాటిక్‌/సెక్టోరియల్‌ ఫండ్లపై ఆసక్తి ఇందుకు ప్రధాన కారణమని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. సిస్టమేటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌(సిప్‌) పథకాల్లోకి కూడా ఫిబ్రవరి జీవితకాల గరిష్టం రూ.19,186 కోట్లకు చేరాయి. జనవరి ఇవి రూ.18,838 కోట్లుగా ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement