రక్తదానం ప్రాణ దానంతో సమానం | - | Sakshi
Sakshi News home page

రక్తదానం ప్రాణ దానంతో సమానం

Aug 1 2025 11:32 AM | Updated on Aug 1 2025 11:32 AM

రక్తదానం ప్రాణ దానంతో సమానం

రక్తదానం ప్రాణ దానంతో సమానం

లక్ష్మీపురం: ప్రతి ఒక్కరూ సేవా భావం కలిగి ఉండాలని, రక్తదానం చేయడం అంటే ఒక ప్రాణాన్ని కాపాడటమే అని గుంటూరు రైల్వే డివిజనల్‌ మేనేజర్‌ సుధేష్ట సేన్‌ అన్నారు. నగరంపాలెంలోని జిల్లా పరిషత్‌ కార్యాలయ ప్రాంగణంలో గల రెడ్‌ క్రాస్‌ బ్లడ్‌ బ్యాంక్‌ సెంటర్‌లో గుంటూరు రైల్వే డివిజన్‌ కార్యాలయ సిబ్బందితో రక్తదాన శిబిరం నిర్వహించారు. ముందుగా డీఆర్‌ఎం శిబిరాన్ని ప్రారంభించి రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్వచ్ఛందంగా చిన్నతనం నుంచి రక్తదానం చేస్తున్నట్లు తెలిపారు. క్రమం తప్పకుండా దాతగా ఉన్నానని చెప్పారు. యువతీ, యువకులంతా క్లిష్టమైన వైద్య, అత్యవరసర పరిస్థితుల్లో ప్రాణాలను రక్షించే శక్తి ఉన్న గొప్ప లక్ష్యంలో చేరాలని కోరారు. గుంటూరు రైల్వే డివిజన్‌ అభివృద్ధితో పాటు ఇలాంటి సామాజిక సేవా కార్యాక్రమాలు నిర్వహించడంలో ముందంజలో ఉండాలని సూచించారు. అనంతరం డివిజన్‌ పరిధిలో 74 మంది సిబ్బంది, అధికారులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. కార్యక్రమంలో ఏడీఆర్‌ఎం ఎం.రమేష్‌కుమార్‌, సీనియర్‌ డివిజనల్‌ పర్సన్‌ ఆఫీసర్‌ షహబాజ్‌ హనూర్‌, సీనియర్‌ డివిజనల్‌ ఫైనాన్స్‌ మేనేజర్‌ అమూల్యా బి. రాజ్‌, సీనియర్‌ డివిజనల్‌ మెటీరియల్స్‌ మేనేజర్‌ కార్తికేయ గాడఖ్‌, డివిజనల్‌ కమర్షియల్‌ మేనేజర్‌ కమలాకర్‌బాబు, సీనియర్‌ డివిజనల్‌ సేఫ్టీ ఆఫీసర్‌ విజయ కార్తి, అసిస్టెంట్‌ సెక్యూరిటీ కమిషనర్‌ శైలేష్‌కుమార్‌, రెడ్‌ క్రాస్‌ బ్లడ్‌ బ్యాంక్‌ వైద్య అధికారి డాక్టర్‌ మేడూరి భాస్కరరావు, జిల్లా సమన్వయకర్త రసూల్‌ పాల్గొన్నారు.

రక్తదానం చేసిన డీఆర్‌ఎం సుధేష్ట సేన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement