ప్రకృతి అందాలకు పెట్టని కోట
పర్యాటకులకువిహంగ వీక్షణ ఏర్పాటు
గండికోట ఉత్సవాల్లో ప్రాధాన్యత ఏదీ?
రేపటి నుంచి ఉత్సవాలు
జమ్మలమడుగు: 11వ శతాబ్దంలో చాణక్య రాజైన కాకరాజు గండికోట నిర్మాణం కోసం శ్రీకారం చుట్టారు. ఇప్పటికి గండికోట నిర్మాణం జరిగి 903 సంవత్సరాలు అవుతున్నట్లు చరిత్ర చెబుతోంది. ఇక్కడ గోల్కొండ నవాబుల కాలంలో జుమ్మా మసీదు నిర్మించారు. శ్రీకృష్ణదేవరాయలు సైతం గండికోటను పాలించినట్లు చరిత్ర చెబుతోంది. గండికోట వైభవాన్ని ప్రపంచానికి తెలియపరిచేందుకు గండికోట ఉత్సవాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం గ్రాండ్ కెన్యాన్ ఆఫ్ ఇండియాగా ప్రప ంచంలో ప్రఖ్యాతి గాంచిన గండికోట అందాలను వీక్షించడం కోసం ఇతర రాష్ట్రాల నుంచి భారీగా పర్యాటకులు వచ్చిపోతున్నారు. గండికోట అభివృద్ధికి నాటి ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ రాజశేఖర్రెడ్డి శ్రీకారం చుట్టారు. గండికోటకు వచ్చే పర్యాటకులకు సరైన వసతుల కల్పన కోసం టూరిజం అభివృద్ధి కింద హరిత హోటల్ నిర్మాణం చేపట్టారు. ప్రస్తుతం ఇది పర్యాటకులకు ఎంతో ఉపయోగపడుతోంది. ప్రస్తుతం గండికోటలో రిసార్టులతోపాటు, టూరిస్టుల కోసం టెంట్ కల్చర్ను తీసుకు రావడంతో పర్యాటకులు పెన్నానది అందాలు చూడటంతో పాటు సూర్యోదయం, సూర్యా స్తమయం వీక్షించి కనులపండువ చేసుకుంటున్నారు. పెన్నానది లోయ అందాలను ఫేస్బుక్, యూట్యూబ్లలో పెడుతుండటంతో భారీగా పర్యాటకులు వస్తున్నారు.
11 నుంచి గండికోట ఉత్సవాలు
గండికోట ఉత్సవాలు ఈనెల 11వ తేదీ ఆదివారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ప్రముఖ గాయని మంగ్లీ, రామ్ మిర్యాల పాటల కార్యక్రమం, ప్రముఖ డ్రమ్స్ శివమణితో ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు.
అసలు సమస్య రవాణా సౌకర్యం
పర్యాటక కేంద్రమైన గండికోటకు సరైన రవాణా సౌకర్యం లేదు. ఆర్టీసీ బస్సులు ఉదయం, సాయంత్రం పూట మాత్రమే గండికోటకు ఉన్నాయి. ఆ తర్వాత ఆటోలపైనే పర్యాటకులు, స్థానికులు ఆధారపడవలసి వస్తుంది. ప్రస్తుతం ప్రభుత్వం గండికోట ఉత్సవాలకు శ్రీకారం చుట్టినందున పర్యాటకులకు సరైన రవాణా సౌకర్యం కల్పించవలసిన అవసరం ఎంతైనా ఉంది.
ఉత్సవాలకు ఏర్పాట్లు
గండికోట ఉత్సవాల్లో జిల్లాలోని చరిత్రకారులు, కళాకారులకు ప్రాధాన్యత శూన్యమనే చెప్పాలి. ఇప్పటికి వరకూ సింగర్స్ మంగ్లీ, రామ్ మిర్యాల, డ్రమ్స్ శివమణి ఒక్కొక్క రోజు ఒకరు పాల్గొననున్నారు. ఆమేరకు కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ వెల్లడించారు. ఫలితంగా ఆనాటి వైభవం ఉట్టి పడేలా ఉత్సవాలను నిర్వహించడం, జిల్లా ప్రజల్ని భాగస్వామ్యులను చేయడంలో విఫలమయ్యారని పరిశీలకులు వెల్లడిస్తున్నారు. ఈ నెల 11, 12, 13వ తేదీలలో గండికోట ఉత్సవాలు నిర్వహిస్తుంటే ఆ దిశగా ప్రణాళికలు, స్థానికుల భాగస్వామ్యం దక్కలేదు. పైగా గండికోట కేంద్రంగా పెమ్మసాని వంశస్థులు పాలించారు. వారిలో పెమ్మసాని చిన తిమ్మనాయుడు ప్రముఖుడు. వారి వారసుడు పెమ్మసాని ప్రభాకర్నాయుడు ఇప్పటికీ పలుమార్లు గండికోట ఉత్సవాలకు హాజరయ్యారు. కాగా, అధికార యంత్రాంగం జిల్లా ప్రజలతో పాటు, పెమ్మసాని వారసులను కూడా విస్మరించారు. గండికోట ఉత్సవాలు నిర్వహిస్తున్నారనే సమాచారం మినహా ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారనేది ఇప్పటికీ ప్రజానీకానికి స్పష్టత లేకుండా పోయింది. సినిమా సెట్టింగ్ తరహాలో ఏర్పాట్లు చేయడం మినహా గండికోట ఉత్సవాల్లో జిల్లా వాసుల భాగస్వామ్యం ఏముందంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు.
పర్యాటకులకు గండికోట అందాలతో పాటు మైలవరం జలాశయం, ఆకాశ మార్గం నుంచి పెన్నానది లోయ అందాలు ఎంతో అద్భుతంగా పర్యాటకులకు చూపించాలనే లక్ష్యంతో విశాఖపట్నంకు చెందిన విహంగ్ సంస్థ ప్యారమోటర్స్, హెలిక్యాప్టర్ల ద్వారా సన్నద్ధమైంది. ఈ క్రమంలో హెలిక్యాప్టర్ శనివారం గండికోటకు చేరుకోనుంది. హెలిక్యాప్టర్లో పర్యాటకులు వీక్షించాలంటే ఐదువేల రూపాయలు ఒక్కరికి చెల్లించాల్సి ఉంటుంది. ఆరు నిమిషాల పాటు ఆకాశ మార్గంలో విహరించి గండికోట అందాలను చూపించబోతున్నారు.
గండికోటకు 903 సంవత్సరాలు
ఉత్సవాల సందర్భంగా విహంగ్ సవారి
మూడు రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు
చురుగ్గా ఏర్పాట్లు
ప్రకృతి అందాలకు పెట్టని కోట
ప్రకృతి అందాలకు పెట్టని కోట


