మృత్యువులా దూసుకొచ్చిన లారీ | - | Sakshi
Sakshi News home page

మృత్యువులా దూసుకొచ్చిన లారీ

Sep 25 2025 7:23 AM | Updated on Sep 25 2025 7:23 AM

మృత్యువులా దూసుకొచ్చిన లారీ

మృత్యువులా దూసుకొచ్చిన లారీ

ఒకరి మృతి, మరొకరికి గాయాలు

గువ్వలచెరువు ఘాట్‌లో దుర్ఘటన

చింతకొమ్మదిన్నె /లక్కిరెడ్డిపల్లె: చింతకొమ్మదిన్నె మండల పరిధిలోని గువ్వల చెరువు ఘాట్‌ జాతీయ రహదారిపై రాయచోటి వైపు నుంచి అతివేగంతో దూసుకొచ్చిన లారీ ఎదురుగా వస్తున్న ద్విచక్రవహనాన్ని ఢీకొనడంతో కొప్పల లక్షుమయ్య (60) మృతి చెందాడు. కొప్పల. ఈశ్వరయ్య అనే వ్యక్తికి గాయాలయ్యాయి. బుధవారం మధ్యాహ్నం రాయచోటి వైపు నుంచి ఎలక్ట్రికల్‌ పరికరాలతో కూడిన గూడ్స్‌ లారీ వేగంగా రావడంతో నాలుగో మలుపు సమీపంలోని స్పీడ్‌ బ్రేకర్ల వద్ద లారీని డ్రైవర్‌ అదుపుచేయలేక లారీ డ్రైవర్‌ కిందికి దూకేశాడు. ఆ సమయంలో రోడ్డుకు అవతలవైపున ఎదురుగా గువ్వలచెరువు వెపు వెళ్తున్న ద్విచక్రవాహనదారుడు ఈశ్వరయ్య గమనించి ద్విచక్రవాహనాన్ని ఆపే ప్రయత్నం చేశాడు. అయినప్పటికీ లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీ కొంది. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనంలో ప్రయాణిస్తున్న కొప్పల లక్షుమయ్యను లోయవైపు ఈడ్చుకుపోగా కుడి కాలు, కుడి చేయి తెగి పడి, సంఘటన స్థలంలోనే మృతి చెందాడు. ద్విచక్రవాహనంలోని మరో వ్యక్తి కొప్పల ఈశ్వరయ్యకు గాయలయ్యాయి. లారీ డ్రైవర్‌ లారీ లోయ వైపు దూసుకెళ్లే క్రమంలో లారీ నుండి ముందే దూకి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ప్రమాదంలో మృతిచెందిన లక్షమయ్య, గాయపడిన ఈశ్వరయ్య సమీప బంధువులే. వీరిది లక్కిరెడ్డిపల్లె మండలంలోని దప్పేపల్లె రామాపురం గ్రామం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement