– జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి గుణశేఖర్
రాజంపేట రూరల్ : జిల్లా పరిధిలోని గొర్రెలకు నీలి నాలుక బ్లూ టంగ్ వ్యాధి నిరోధక టీకాలను ఉచితంగా అందించనున్నట్లు జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి డాక్టర్ గుణశేఖర్ తెలియజేశారు. మండల పరిధిలోని హెచ్ చెర్లోపల్లి గొల్లపల్లి గ్రామంలో శనివారం గొర్రెలకు నీలి నాలుక (బ్లూ టంగ్) వ్యాధి నిరోధక టీకాలను ఉచితంగా అందజేశారు డాక్టర్ గుణశేఖర్ గొర్రెల యజమానులకు నీలి నాలుక వ్యాధి లక్షణాలపై అవగాహన కల్పించారు. అలాగే టీకాల ఆవశ్యకతను, తీసుకోవల్సిన జాగ్రత్తలను వివరించారు. కార్యక్రమంలో రాజంపేట ప్రాంతీయ పశువైద్యశాల సహాయ సంచాలకులు డాక్టర్ ప్రతాప్, హెచ్ చెర్లోపల్లి పశువైధ్యాకారి డాక్టర్ కే.భాగ్యావతి, జూనియర్ వెటర్నటీ అధికారి ఎం.వరదయ్య, గోపాల మిత్రలు ఎం.బాస్కర్, సీ.బాలాజీ తదితరులు పాల్గొన్నారు.
బైక్ ప్రమాదంలో బొగ్గు కూలీ మృతి
మదనపల్లె రూరల్ : జీవనోపాధి కోసం నెల్లూరు జిల్లా నుంచి వలస వచ్చి బైక్లో వెళుతూ ప్రమాదంలో బొగ్గుకూలీ తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన శనివారం మదనపల్లె జిల్లా ఆస్పత్రిలో జరిగింది. నెల్లూరు జిల్లా కలువాయికి చెందిన ఎం.అంకయ్య(30) తన భార్య ప్రశాంతి, కుటుంబంతో సహా ఉపాధి నిమిత్తం కలకడ సమీపంలోని మల్లిగుట్టపల్లెకు వచ్చి రెండేళ్లుగా ఉంటున్నాడు. స్థానికంగా కలప కాల్చి బొగ్గు తయారీ కూలిగా పనిచేస్తున్నాడు. 11వతేదీ బుధవారం కలప కోసేందుకు వినియోగించే యంత్రం మరమ్మతుకు గురికావడంతో రిపేరీ చేసుకునేందుకు గుర్రంకొండకు వెళ్లాడు. తిరిగి స్వగ్రామానికి వస్తూ వాహనం అదుపుతప్పి మార్గమధ్యంలో రోడ్డుపక్కన ఉన్న బోర్డును ఢీకొని తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన స్థానికులు ఆస్పత్రికి తీసుకువెళ్లి చికిత్సలు చేయడంతో కోలుకుని ఇంటికి వెళ్లాడు. గురువారం ఒంట్లో నలతగా ఉంటే మదనపల్లెకు వచ్చి ప్రైవేట్ ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకున్నాడు. ప్రమాదం లేదని చెప్పడంతో తిరిగి ఇంటికి వెళ్లిపోయాడు. అయితే శరీరంలోని లోపలి గాయాలు తిరగబెట్టడంతో శనివారం తీవ్రంగా కడుపునొప్పి రావడంతో కుటుంబసభ్యులు హుటాహుటిన మదనపల్లెలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకువచ్చారు. అక్కడి వైద్యుల సూచన మేరకు సొసైటీకాలనీలోని మరో ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే పరిస్థితి విషమించడంతో అక్కడి వైద్యులు తిరుపతికి తీసుకెళ్లాలని రెఫర్ చేశారు. ప్రభుత్వ ఆస్పత్రిలో 108 అంబులెన్స్ ఉచితంగా అందుబాటులో ఉంటుందని సూచించడంతో, అంకయ్యను శనివారం సాయంత్రం తీసుకువచ్చారు. అత్యవసర విభాగంలో చికిత్స అందించినా అనంతరం పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు తిరుపతికి రెఫర్ చేశారు. అంబులెన్స్లోకి ఎక్కించేందుకు ప్రయత్నిస్తుండగానే అంకయ్య మృతి చెందాడు. కాగా మృతునికి ముగ్గురు కుమార్తెలు పవిత్ర, కళావతి, గౌతమి ఉన్నారు.
గొర్రెలకు ఉచిత వ్యాధి నిరోధక టీకాలు
గొర్రెలకు ఉచిత వ్యాధి నిరోధక టీకాలు