ఉపాధి కల్పించాలి
ఎండీయూ వాహనాలను నిలిపి వేయాలన్న ఆలోచనను ప్రభు త్వం విరమించాలి.ప్రస్తుతం పనిచేస్తున్న ఆపరేటర్లు, హెల్పర్లకు ఉపాధి కల్పించాలి. వైఎస్ జగన్ సర్కార్ ఉన్నతాశయంతో కార్డుదారులకు ఇబ్బందులు లేకుండా ఇంటి వద్దకే రేషన్ సరుకులను తీసుకొచ్చింది. ఈ విధానాన్ని తొలగించడంతో కార్డుదారులు మళ్లీ సరుకుల కోసం అనేక ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుంది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వం పునరాలోచన చేయాలని వైఎస్సార్ సీపీ తరుపున డిమాండ్ చేస్తున్నాం. – ఆకేపాటి అమర్నాథరెడ్డి, వైఎస్సార్సీపీ
జిల్లా అధ్యక్షుడు, రాజంపేట ఎమ్మెల్యే


