ఏపీవ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ నిరసనలు | Ysrcp Leaders Protests Across Andhra Pradesh | Sakshi
Sakshi News home page

ఏపీవ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ నిరసనలు

Apr 4 2026 9:57 AM | Updated on Apr 4 2026 10:58 AM

Ysrcp Leaders Protests Across Andhra Pradesh

సాక్షి, తాడేపల్లి: టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు రాజీనామా చేయాలని డిమాండ్  చేస్తూ.. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ నిరసనలు చేపట్టింది. వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన వైఎస్సార్‌సీపీ నేతలు.. ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలోనూ నిరసనలు చేపట్టారు. బీఆర్ నాయుడు రాసలీలలు వెలుగులోకి వచ్చినా సీఎం చంద్రబాబు చర్యలు తీసుకోకపోవటంపై వైఎస్సార్‌సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం  చేశారు.

ఇప్పటికీ బీఆర్ నాయుడిని వెనకేసుకువస్తున్న చంద్రబాబు తీరుపై మండిపడ్డారు. ప్రపంచవ్యాప్త హిందూ భక్తులు, నెటిజన్ల విమర్శలను కూడా చంద్రబాబు పట్టించుకోవడం లేదని వైఎస్సార్‌సీపీ మండిపడుతోంది.

వైఎస్సార్ జిల్లా: టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వ్యవహార శైలిపై పులివెందులలో  వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. పట్టణంలోని వెంకటేశ్వర ఆలయంలో 101 టెంకాయలు కొట్టి వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బీఆర్ నాయుడు అనైతిక కార్యకలాపాలు, ఆయన వ్యవహార శైలితో టీటీడీ పవిత్రతను దెబ్బతీస్తున్నాడని ఆయనకు మంచి బుద్ధి ప్రసాదించాలని వైఎస్సార్‌సీపీ నేతలు ప్రత్యేక పూజలు చేశారు.

బీఆర్ నాయుడు టీటీడీ చైర్మన్ పదవి నుంచి వెంటనే తొలగించి టీటీడీ పవిత్రతను కాపాడాలని వైఎస్సార్‌సీపీ నాయకుల డిమాండ్ చేశారు. ఈ నిరసన మాజీ మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ చిన్నప్ప, పట్టణ అధ్యక్షుడు హల్ గంగాధర్ రెడ్డి, వైఎస్సార్‌సీపీ శ్రేణులు పాల్గొన్నాయి.

అనంతపురం జిల్లా: మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడును వెంటనే తొలగించాలని కోరుతూ అనంతపురంలో వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం నేతలు ఆందోళన నిర్వహించారు. అనంతపురం నగరంలోని శ్రీకంఠం సర్కిల్‌లోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ప్లకార్డులు ధరించి నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎందుకు మౌనంగా ఉంటున్నారంటూ మండిపడ్డారు.

విశాఖపట్నం: టీటీడీ చైర్మన్‌ బీఆర్ నాయుడిని పదవి నుంచి తొలగించాలని వైఎస్సార్‌సీపీ డిమాండ్  చేసింది. విశాఖ తూర్పు నియోజకవర్గంలోని వెంటేశ్వరస్వామి వారి ఆలయంలో వైఎస్సార్‌సీపీ శ్రేణులు ప్రత్యేక పూజలు పూజలు నిర్వహించాయి. వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త మొల్లి అప్పారావు, జిల్లా మహిళా అధ్యక్షురాలు రమణకుమారి, మాజీ మేయర్ హరి వెంకట కుమారి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement