అమర జవాన్లకు వైఎస్‌ జగన్‌ ఘననివాళి | YS Jagan paid tributes to the martyred soldiers | Sakshi
Sakshi News home page

అమర జవాన్లకు వైఎస్‌ జగన్‌ ఘననివాళి

Dec 17 2025 4:19 AM | Updated on Dec 17 2025 4:19 AM

YS Jagan paid tributes to the martyred soldiers

సాక్షి, అమరావతి: 1971లో జరిగిన యుద్ధంలో దేశ విజయం కోసం ప్రాణాలర్పించిన సైనికుల వీరత్వానికి, త్యాగానికి గౌరవప్రదమైన నివాళి అర్పిస్తున్నామని వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. 

ఈ మేరకు ఆయన మంగళవారం ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. ‘విజయ్‌ దివస్‌ నాడు అమర జవాన్ల పరాక్రమాన్ని ప్రతియేటా మనం స్మరించుకుంటున్నాం. వారి సేవలు ఎప్పటికీ జ్ఞాపకంగా నిలుస్తాయి. రాబోయే తరాలకు జవాన్లు శాశ్వత ప్రేరణగా నిలుస్తారు’ అని వైఎస్‌ జగన్‌ కొనియాడారు. 

Advertisement
 
Advertisement
Advertisement