సాక్షి,విజయవాడ: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. లాకప్లో సాయికృష్ణను పోలీసులు కొట్టారని, ఈ దారుణాన్ని తానే ప్రత్యక్షంగా చూశానంటూ మహంకాళి చందు అనే యువకుడు వీడియోలో చెప్పాడు. ఆ వీడియోను ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేశాడు.
సాయిని లాకప్లో దారుణంగా కొట్టారు. చిత్ర హింసలు పెట్టారు నేను చూశాను. నేను లాకప్లో ఉన్నప్పుడే చిత్ర హింసలు పెట్టారు.అరెస్ట్ చేస్తే కోర్టులో పెట్టాలి. కానీ 6 టౌన్ పోలీసులు చిత్ర హింసలు పెట్టారు. ఆ రోజు సాయితో వచ్చినవాళ్లందరిని బయటకు పంపించారు. ఎందుకు బయటకు పంపించారు. సాయిని ఏం చేయాలని పంపించారు’అని ప్రశ్నించారు.


