సకాలంలో రైల్వే ప్రాజెక్టులు పూర్తి | Railway projects are completed on time | Sakshi
Sakshi News home page

సకాలంలో రైల్వే ప్రాజెక్టులు పూర్తి

Oct 5 2024 5:37 AM | Updated on Oct 5 2024 5:37 AM

Railway projects are completed on time

రూ.2,300 కోట్లతో అమరావతి రైల్వేలైన్‌కు డీపీఆర్‌ 

విజయవాడలో డ్రైనేజీ వ్యవస్థ అభివృద్ధికి సహకారం

దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్‌కుమార్‌ జైన్‌

కడప–బెంగళూరు లైన్‌ పనులు సత్వరం పూర్తిచేయాలన్న వైఎస్సార్‌సీపీ ఎంపీలు

సాక్షి, అమరావతి: మూడేళ్ల క్రితం రూ.55 వేల కోట్ల వ్యయంతో రాష్ట్రంలో చేపట్టిన రైల్వే ప్రాజెక్టులను సకాలంలో పూర్తిచేస్తామ­ని దక్షిణ­మధ్య రైల్వే జీఎం అరుణ్‌కుమార్‌ జైన్‌ తెలిపా­రు. వాటిలో కొత్త రైల్వేలైన్ల నిర్మాణం, డబ్లింగ్, ట్రిప్లింగ్‌ పనులు, కొత్త లైన్ల కోసం సర్వే మొదలైన ప్రాజెక్టులు ఉన్నాయన్నారు. అమరా­వతి మీదుగా ఎర్రు­పా­లెం–­నంబూరు మధ్య కొత్త రైల్వేలైన్‌ నిర్మాణం కోసం రూ.2,300 కోట్ల అంచనా వ్యయంతో సమగ్ర ప్రాజెక్టు నివేదికను రైల్వే­శాఖకు సమర్పించామని ఆయ­న చెప్పారు. 

దక్షిణ మధ్య రైల్వే పరిధిలో రాష్ట్రంలో రైల్వే వ్యవస్థ అభివృద్ధిపై ప్రతిపాదనల కో­సం రాష్ట్ర ఎంపీలతో దక్షిణ మధ్య రైల్వే ఉన్న­తాధి­కా­రులు శుక్రవారం విజయవాడలో సమీ­క్షా సమా­వేశం నిర్వహించారు. అనంతరం.. జీఎం మీడియా­తో మాట్లాడారు. గత మూడేళ్లలో 33 రైల్వేస్టే­షన్ల­లో 88 కొత్త లిఫ్టులు, 19 రైల్వేస్టేషన్లలో 218 ఫుట్‌ఓవర్‌ బ్రిడ్జిలు నిర్మించామన్నారు. ఇక 101 మానవరహిత లెవల్‌ క్రాసింగ్‌లను తొలగించామన్నారు. 

257 లెవల్‌ క్రాసింగ్‌ల వద్ద ఆర్‌యూబీలు, ఆర్‌ఓబీల నిర్మాణానికి ఆమో­దం తెలిపామన్నారు. అమృత్‌ భారత్‌ పథకం కింద రాష్ట్రంలో 56 రైల్వేస్టేషన్లను రూ.2,593 కోట్లతో అభివృద్ధి చేస్తామన్నా­రు. కొత్త రైల్వేలైన్ల నిర్మాణం, కొత్త రైళ్లు ప్రవేశపెట్టడం, అదనపు స్టాపేజీలు, ఆర్‌ఓబీ­లు–­ఆర్‌యూబీల నిర్మా­ణం, ప్రయాణికు­లకు మెరుగైన సౌక­ర్యాల కోసం ఎంపీలు చేసిన ప్రతిపాదనలను సానుకూ­లంగా పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటామని అరుణ్‌­కుమార్‌ జైన్‌ చెప్పారు. 

విజయవా­డలో డ్రైనేజీ వ్యవస్థ అభివృద్ధి కోసం రెవెన్యూ, మున్సి­పల్‌ కార్పొరేషన్‌ల­తో కలిసి పనిచేస్తామ­న్నారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు భూపతిరాజు శ్రీనివాస వర్మ, పెమ్మసాని చంద్రశేఖర్‌ల­తోపా­టు ఎంపీలు గొల్ల బాబూరావు, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, వైఎస్‌ అవినాశ్‌రెడ్డి, సీఎం రమేశ్, జీఎం హరీశ్‌ బాలయోగి, పుట్టా మహేశ్‌కుమార్, కేశినేని శివనాథ్, తెన్నేటి కృష్ణప్రసాద్‌ తదితర ఎంపీలు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement