జగనన్న పథకాలకు ఆకర్షితుడై.. 55 సెంట్ల భూమి దానం

Padmanabhudu Who Provided Land For Government Buildings - Sakshi

ప్రభుత్వ భవనాల నిర్మాణానికి స్థలమిచ్చిన పద్మనాభుడు 

సాక్షి, శ్రీకాకుళం (మందస): ప్రభుత్వం నాకేమిచ్చిందని ఆలోచించే రోజులివి.. కానీ ఆయన మాత్రం సర్కారుకే చేయూతనందించడానికి ముందుకు వచ్చారు. భోగాపురం పంచాయతీ కేంద్రంలో సచివాలయం, రైతు భరోసా కేంద్రం నిర్మాణానికి స్థలం దొరక్క అధికారులు సతమతమవుతుండగా.. నేనున్నానంటూ ఇదే గ్రామానికి రైతు పద్మనాభచౌదరి భూమి ఇవ్వడానికి ముందుకు వచ్చారు. సుమారు 55 సెంట్ల భూమిని ప్రభుత్వ భవనాల నిర్మాణానికి దానం చేశారు. కాస్తంత స్థలముంటే కమర్షియల్‌గా ఆలోచించే రోజుల్లో మహేంద్రతనయ ప్రవహించే విలువైన సారవంతమైన భూమిని ఉచితంగా అందించిన దాతను అందరూ అభినందిస్తున్నారు.    

(టీడీపీ ఇన్‌చార్జ్‌పై కలెక్టర్‌ సీరియస్‌)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top