తిరుమలలో మంత్రి ఆనంను నిలదీసిన భక్తులు | minister anam ramanarayana reddy questioned by tirumala devotees for darshan problems | Sakshi
Sakshi News home page

తిరుమలలో మంత్రి ఆనంను నిలదీసిన భక్తులు

Sep 16 2024 1:42 PM | Updated on Sep 16 2024 3:00 PM

minister anam ramanarayana reddy questioned by tirumala devotees for darshan problems

తిరుమల, సాక్షి: తిరుమలలో రా‍ష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. ఓ భక్తుడు మూడు రోజులుగా శ్రీవారి దర్శనం కాలేదని, వీఐపీలు మాత్రమే భక్తులా అంటూ శ్రీవారి దర్శనానికి వచ్చిన మంత్రిని నిలదీశాడు. తిరుమలలో సామాన్య భక్తులకు నరకం చూపిస్తున్నారని అన్నారు.

గంటల తరబడి క్యూలైన్‌లో ఉన్నా ఆహారం అందలేదని, శ్రీవారి దర్శనం చేసుకోలేక పోతున్నామని భక్తులు ప్రశ్నించారు. ఆలయం ముందు భక్తులు ప్రశ్నించడంతో మళ్లీ మాట్లాడుతానంటూ మంత్రి రామనారాయణరెడ్డి అక్కడి నుంచి వెళ్లిపోయారు.

మంత్రి ఆనంను నిలదీసిన భక్తులు

Advertisement
 
Advertisement
Advertisement