మరుపురాని మహోన్నత నేత రాజన్న | Late CM YS Rajasekhara Reddy death anniversary observed with great pomp | Sakshi
Sakshi News home page

మరుపురాని మహోన్నత నేత రాజన్న

Sep 3 2025 4:17 AM | Updated on Sep 3 2025 4:16 AM

Late CM YS Rajasekhara Reddy death anniversary observed with great pomp

రాజమండ్రిలో వైఎస్‌ విగ్రహం వద్ద నివాళులర్పిస్తున్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి తదితరులు

ఊరూరా ఘనంగా దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి వర్ధంతి 

దేశ, విదేశాల్లో ఘనంగా నివాళులు

వెల్లువెత్తిన సేవా కార్యక్రమాలు.. అన్న, వస్త్ర, రక్తదానాలు 

పండ్లు, దుప్పట్లు, దివ్యాంగులకు ట్రైసైకిళ్ల పంపిణీ 

వైఎస్సార్‌తో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకున్న నేతలు, అభిమానులు

తెలుగు రాష్ట్రాలు భారత రత్నకు ప్రతిపాదించాలని పలువురి ఆకాంక్ష

సాక్షి, అమరావతి/నెట్‌వర్క్‌: మహానేత, దివంగత సీఎం డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా, దేశ వి­దేశాల్లో  నా­య­కులు, అభిమానులు, ప్రజలు ఆ­య­న­­కు ఘ­నంగా నివాళులర్పించారు. మరుపు­రాని మహో­న్న­త నేత అని కొనియాడారు. వాడ­వాలా ఆయన విగ్రహాలు, చిత్రపటాల వద్ద పు­ష్పాంజలి ఘటించారు. జోహార్‌ వైఎస్సార్‌.. వైఎ­స్సార్‌ అమర్‌రహే అన్న నినాదాలు ఊరూరా ప్రతి­ధ్వనించాయి. తె­లంగాణ, కర్ణాటక, తమిళ­నాడు, ఢిల్లీ సహా వివిధ ప్రాంతాల్లోను, బ్రిటన్, అమెరికా, ఆస్ట్రేలియా, న్యూ­జిలాండ్‌ దేశాల్లోని వివిధ రాష్ట్రా­ల్లోను వైఎస్సార్‌ వర్ధంతిని నిర్వహించారు. 

మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ­లు, ఇతర ప్రజాప్ర­తి­నిధులు, వైఎస్సార్‌సీపీ నేత­లు, కార్యకర్తలు, పార్టీ అనుబంధ విభాగాల నేత­లు, ప్రజలు పాల్గొన్న ఈ కార్యక్రమాల్లో పలుచోట్ల అన్నదానం, వస్త్రదానం, రక్తదానం చేశారు. వృద్ధా­శ్రమాలు, అనాథ శరణా­లయాలు, ఆస్పత్రుల్లో పండ్లు పంపిణీ చేశారు. పేదలకు దుప్పట్లు అందజేశారు. దివ్యాంగులకు ట్రైసైకిళ్లు పంపిణీ చేశా­రు. 

పలుచోట్ల వైద్యశిబి­రాలు ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్ర­మాలను స­మానంగా ముందుకు తీసుకెళ్లి, పరిపా­లనలో సమానత్వాన్ని చాటుకుంటూ ప్రజల హృద­యాల్లో చెరగని ముద్ర వేసుకుని పాలకుడంటే ఎలా ఉండాలో చాటి­చెప్పారని ప్రజలు, వైఎస్సా­ర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రవాసాంధ్రులు స్మరించుకున్నారు. 

» వైఎస్సార్‌ కడప జిల్లా ఇడుపులపాయలోని వైఎస్సార్‌ సమాధి వద్ద పలువురు నివాళుల­ర్పించారు. పలు ప్రాంతాల నుంచి బస్సులు, ఇతర వాహనాల్లో సోమ­వారం రాత్రి­కే ఇడుపు­లపాయ చేరుకున్నారు. సమాధిపై పూ­ల­మాలలుంచి మహానేతను స్మరించుకున్నారు.  
»  కువైట్‌లోని మాలియా ప్రాంతంలోని పవన్‌ ఆంధ్ర రెస్టారెంట్‌లో వైఎస్సార్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.  
»  ఢిల్లీలోని ఏపీ భవన్‌లో వైఎ­స్సార్‌కు ఘనంగా నివాళులర్పించారు. రూరల్‌ అగ్రికల్చర్‌ డెవల­ప్‌మెంట్‌ సొసైటీ అధ్యక్షుడు బి. మదన్మోహన్‌ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలో అభి­మానులు వైఎస్సార్‌ చిత్రపటా­నికి పూలమా­లలు వేసి ’వైఎస్సార్‌ అమర్‌ రహే’ నినాదాలు చేశారు. వైఎస్సార్‌కు భారత­రత్న ఇవ్వాలని రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రానికి ప్రతి­పాదించాలని కోరారు.  ఇంద్రప్రస్థ తెలుగు అసోసి­యేషన్‌ ప్రధాన కార్యదర్శి బి. కోటిరెడ్డి, తెలుగు క్రిస్టియన్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు బత్తుల శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.
» అలాగే, దక్షిణాఫ్రికా లోని జొహనెస్‌బర్గ్‌లోని కమ్యూనిటీ సెంటర్‌ బేకరీలో రూ.5 లక్షల విలువైన వస్త్రాలు, ఆహార ధాన్యాలను ప్రవాసాంధ్రులు పంపిణీ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement