ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

Gadapa Gadapaki Mana Prabhutvam Success All Over AP - Sakshi

గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు

సాక్షి, నెట్‌వర్క్‌: గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం ఉత్సాహంగా సాగింది. ఇందులో పాల్గొన్న పలువురు ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ఎటువంటి అవినీతికి తావు లేకుండా తమకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయని ఈ సందర్భంగా ప్రజాప్రతినిధుల వద్ద పలువురు లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు.

ఇళ్లకు వస్తున్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికారులకు ప్రజలు వాడవాడనా ఎదురేగి స్వాగతం పలికారు. సంక్షేమాభివృద్ధే లక్ష్యంగా ముందుకు వెళుతున్న వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికి తమ ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని దీవించారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top