
సాక్షి, తిరుపతి: తిరుమల శేషాచలం కొండల్లో అగ్ని ప్రమాదం సంభవించింది. శిలాతోరణం, శ్రీవారి పాదాలకు వెళ్లే అటవీ ప్రాంతంలో మంగళవారం మధ్యాహ్నాం మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. ప్రమాదంపై సమాచారం అందుకున్న అటవీ సిబ్బంది ఫైరింజన్లకు సమాచారం అందించారు. రెండు ఫైర్ ఇంజిన్లు అక్కడికి చేరుకుని మంటల్ని ఆర్పే ప్రయత్నం చేస్తున్నాయి. ప్రమాదానికి గల కారణాలు తెలియ రావాల్సి ఉంది.


కెమికల్ ల్యాబ్లో తప్పిన ప్రమాదం
మరోవైపు జిల్లాలోని ఏర్పేడు మండలం ఐసర్ విద్యా సంస్థ కెమికల్ ల్యాబ్లో మంగళవారం మధ్యాహ్నాం అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో ల్యాబ్లో ఉన్న విద్యార్థులు బయటకు పరుగులు తీయగా.. సకాలంలో సిబ్బంది స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకుని మంటల్ని ఫైర్ సిబ్బంది అదుపులోకి తెచ్చారు.