తిరుపతి లీగల్/తిరుమల: తిరుమల శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతినేలా, టీటీడీ పరువుకు భంగం వాటిల్లేలా ఆంధ్రజ్యోతి పత్రిక 2019, డిసెంబర్ 1న ప్రచురించిన కథనంపై టీటీడీ దాఖలు చేసిన పరువు నష్టం కేసును తిరుపతి నాల్గవ అదనపు జిల్లా జడ్డి సత్యానంద్ జూన్ 21వ తేదీకి వాయిదా వేశారు. ఆంధ్రజ్యోతి పత్రిక యాజమాన్యం, ఇతరులు కలిసి టీటీడీ పరువుకు భంగం కలిగించేలా కథనాలు ప్రచురించిన నేపథ్యంలో రూ.100 కోట్లు పరువు నష్టం చెల్లించేటట్లు ఆ పత్రిక యాజమాన్యాన్ని ఆదేశించాలని టీటీడీ తిరుపతి పదో అదనపు జిల్లా జడ్జి కోర్టులో గత ఏడాది పరువు నష్టం కేసును దాఖలు చేసింది.
టీటీడీ తరఫున ఈ కేసును బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుబ్రమణ్యస్వామి వాదిస్తున్నారు. సోమవారం కేసు విచారణకు ఎంపీ హాజరయ్యారు. ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణతో పాటు కేసులో ప్రతివాదులుగా ఉన్న నలుగురు న్యాయ కార్య పద్ధతి పాటించకుండా గత ఏడాది డిసెంబర్ 29న రిటర్న్ స్టేట్మెంట్ను కోర్టులో దాఖలు చేశారని, ఆ స్టేట్మెంట్ను పరిగణలోకి తీసుకోవద్దంటూ గత వాయిదా అప్పుడు ఆయన కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
కొన్ని కారణాలతో కోర్టు ఆ పిటిషన్ రిటర్న్ చేయగా సోమవారం ఎంపీ సుబ్రమణ్యస్వామి ఆ పిటిషన్ను తీసుకుని ఆంధ్రజ్యోతి తరఫు న్యాయవాదికి నోటీసు ఇచ్చి తిరిగి జడ్జికి ఆ పిటిషన్ ఇచ్చారు. అలాగే ఎంపీ సుబ్రమణ్యస్వామి టీటీడీ తరఫున వాదించడానికి అడ్వొకేట్ యాక్ట్ సెక్షన్ 32 కింద ప్రత్యేక అనుమతితో వాదిస్తున్నారని, ఆ అనుమతిని రద్దు చేయాలని ఆంధ్రజ్యోతి తరఫు న్యాయవాది క్రాంతిచైతన్య కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇరువురి పిటిషన్లపై కౌంటర్లు దాఖలు చేయడానికి జడ్జి కేసును జూన్ 21కి వాయిదా వేశారు.
కేసును వాదించే న్యాయ అవగాహన ఉంది
టీటీడీ తరఫున కోర్టులో పరువు నష్టం కేసును వాదించే న్యాయ అవగాహన తనకుందని ఎంపీ సుబ్రమణ్యస్వామి అన్నారు. కేసు వాయిదా అనంతరం ఎంపీ మీడియాతో మాట్లాడారు. అసత్య ప్రచారంపై ఇదివరకే రాష్ట్ర హైకోర్టులో తాము విజయం సాధించామన్నారు. వచ్చే వాయిదాకు ఆంధ్రజ్యోతి వేసిన పిటిషన్పై తాము బదులు ఇస్తామన్నారు. కాగా, సోమవారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో తిరుమల శ్రీవారి మూలమూర్తిని ఎంపీ సుబ్రమణ్యస్వామి దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్ ఆధ్వర్యంలో తిరుమల మరింత అభివృద్ధి చెందిందన్నారు. సీఎం వైఎస్ జగన్ హిందూ ఆలయాల్లో క్రైస్తవాన్ని వ్యాప్తి చేస్తున్నారనేది అసత్యమన్నారు. ఈ విషయాన్ని తాను స్వయంగా పరిశీలించానని చెప్పారు.
ఆంధ్రజ్యోతిపై పరువు నష్టం కేసు వాయిదా
Published Tue, Mar 22 2022 4:17 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నీ ముగ్గురు భార్యలను పరిచయం చెయ్యు పవన్ కళ్యాణ్ ను ఏకిపారేసిన ముద్రగడ
20 ఏళ్ల తర్వాత 'మన్మథుడు' హీరోయిన్ రీఎంట్రీ.. కాకపోతే!
ఓటేద్దాం.. ప్రజాస్వామ్యాన్ని కాపాడుదాం
27 ఏళ్లుగా ఆమె మహిళ..పెళ్లి కుదిరాక వెలుగులోకి షాకింగ్ విషయం..!
కన్నీళ్లు పెట్టుకున్న రోహిత్ శర్మ.. డ్రెస్సింగ్ రూంలో అలా!
మెట్ గాలాలో మెరిసిన ఆలియా.. ఆ చీరకు ఎందుకంత క్రేజ్ అంటే?
నష్టాల్లో ముగిసిన స్టాక్మార్కెట్ సూచీలు
టీడీపీ వాళ్ళు నన్ను డైరెక్ట్ ఎదుర్కోలేక: RK రోజా
బీజేపీలో చేరిన రాధికా ఖేరా.. ఎవరీమె?
కేజ్రీవాల్ కస్టడీ పొడిగింపు.. బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా
తప్పక చదవండి
- Rekha Jhunjhunwala: ఒక్కరోజులోనే రూ.800 కోట్ల నష్టం
- 'పుష్ప' వల్ల నాకు ఎలాంటి లాభం లేదు: ఫహాద్
- జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
- ‘ఒకవేళ బెయిల్ ఇస్తే’.. కేజ్రీవాల్కు కండీషన్ పెట్టిన సుప్రీంకోర్టు
- PK: అన్నయ్య ప్రచారం చేస్తే తప్ప గెలవలేడా?
- ప్లే ఆఫ్స్ రేసులో ఉన్నారా? హార్దిక్ సమాధానం ఇదే!
- Met Gala 2024: తల్లికి తగ్గ కూతురు, ఇషా అంబానీగౌను తయారీకి 10 వేల గంటలు
- వయనాడ్, రాయ్బరేలీ.. గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు?
- వైజాగ్ మాల్యా.. వంశీ!
- LS Elections 3rd Phase: కొనసాగుతున్న మూడో విడత పోలింగ్
Advertisement