సర్వ సమానత్వానికి కృషి చేసిన కారణజన్ముడు అంబేడ్కర్‌

CM YS Jagan Tweet On Ambedkar Jayanti - Sakshi

నేడు ఆయన జయంతి సందర్భంగా సీఎం జగన్‌ ట్వీట్‌ 

సాక్షి, అమరావతి: నవభారత వికాసానికి బాటలు వేసిన దార్శనికుడు, సర్వ మానవాళి సమానత్వానికి కృషి చేసిన కారణజన్ముడు డాక్టర్‌ బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌ అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ కొనియాడారు.

అంబేడ్కర్‌ జయంతిని పురస్కరించుకొని మంగళవారం ఆయన ట్వీట్‌ చేశారు. ‘భారత సమాజానికి అత్యుత్తమమైన, పటిష్టమైన రాజ్యాంగాన్ని అందించిన మహోన్నతుడు అంబేడ్కర్‌. బుధవారం భారతరత్న డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా నిండు మనసుతో నివాళి అర్పిస్తున్నాను’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు.    
(చదవండి: ముస్లిం సోదరులకు సీఎం జగన్‌ శుభాకాంక్షలు)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top