వారం వ్యవధిలోనే రూ.14 వేల కోట్ల అప్పు | Chandrababu Borrows Rs 14 Thousand Crore For Andhra Pradesh In Just One Week, More Details Inside | Sakshi
Sakshi News home page

వారం వ్యవధిలోనే రూ.14 వేల కోట్ల అప్పు

Jun 11 2025 6:05 AM | Updated on Jun 11 2025 10:08 AM

Chandrababu Borrows Rs 14 Thousand Crore for Andhra Pradesh


ఏడాదిలోనే రూ.1.58 లక్షల కోట్ల అప్పుల భారం 

అయినా సూపర్‌ సిక్స్‌ అమలు లేదు 

ఏడాదిలో బడ్జెట్‌ అప్పులే రూ.1,08,194 కోట్లు 

బడ్జెట్‌ బయట అప్పులు మరో రూ.50,410 కోట్లు 

రాష్ట్ర చరిత్రలో ఇంత తక్కువ వ్యవధిలో భారీగా అప్పులు చేసిన ఘనత దక్కించుకున్న చంద్రబాబు

సాక్షి, అమరావతి: కేవలం వారం వ్యవధిలోనే చంద్రబాబు ప్రభుత్వం ఏకంగా రూ.14 వేల కోట్లు అప్పు చేసింది. గత మంగళవారం (3వ తేదీన) రూ.7,000 కోట్లు అప్పు చేసిన చంద్ర­బాబు సర్కారు.. తాజాగా ఈ మంగళవారం మరో రూ.7,000 కోట్లు అప్పు చేసింది. 6.65 శాతం నుంచి 7.8 శాతం వడ్డీకి ప్రభుత్వ సెక్యూరిటీలను విక్రయించడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఈ మొత్తం అప్పును ఆర్‌బీఐ సమీకరించింది. మంగళవారం చేసిన అప్పుతో ఏడాది పాలనలోనే చంద్రబాబు సర్కారు రాష్ట్ర ప్రజలపై రూ. 1,58,604 కోట్ల అప్పుల భారం మోపింది.

ఇందులో బడ్జెట్‌ అప్పులే ఏకంగా రూ.1,08,194 కోట్లకు చేరగా.. బడ్జెట్‌ బయట అప్పులు మరో రూ.50,410 కోట్లకు చేరాయి. బడ్జెట్‌ బయట వివిధ కార్పొరేషన్ల పేరుతో రూ.19,410 కోట్లు అప్పు చేశారు. ఇదికాకుండా రాజధాని అమరావతి పేరుతో ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు, జర్మనీ సంస్థ, హడ్కో నుంచి రూ.31 వేల కోట్లు అప్పు చేస్తోంది. రాజధాని అప్పులకు చంద్రబాబు ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది.  

గనులపైనా అప్పులు 
గనుల శాఖ (ఏపీఎండీ)కు చెందిన 436 మైనర్‌ లీజుల విలువ రూ.1,91,000 కోట్లుగా చూపించి తద్వారా ప్రైవేట్‌ బాండ్లు జారీ ద్వారా రూ.9,000 కోట్లు అప్పు చేయడానికి చంద్రబాబు సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో ఇప్పటికే రూ.3,489 కోట్ల విలువైన బాండ్ల జారీ ద్వారా అప్పు చేసింది. మిగతా మొత్తాన్ని కూడా బాండ్ల జారీ ద్వారా సేకరించనుంది. ఏడాదిలోనే ఇంత పెద్దఎత్తున అప్పులు చేసిన ప్రభుత్వాలు గతంలో లేవు. చంద్రబాబు ప్రభుత్వానికే ఆ ఘనత దక్కింది. 

అయినా.. సూపర్‌ సిక్స్‌ పథకాలకు డబ్బుల్లేవట 
అప్పులు చేయడం ద్వారా చంద్రబాబు సర్కారు రాష్ట్ర ప్రజలను అప్పుల ఊబిలోకి నెట్టేస్తోంది. అయినప్పటికీ సూపర్‌ సిక్స్‌తో పాటు ఇతర హామీలను అమలు చేయడం లేదు. ఎన్నికల ముందు తాము అధికారంలోకి వస్తే అప్పులు చేయకుండానే సంపద సృష్టించి సంక్షేమ, అభివృద్ధి పథకాలు అమలు చేస్తామని చెప్పిన చంద్రబాబు అందుకు విరుద్ధంగా మంగళవారం, మంగళవారం అప్పులు చేస్తూ రాష్ట్ర ప్రజలపై మోయలేని భారం మోపుతున్నారు. మొత్తంగా ఏడాది పాలనలో చంద్రబాబు ప్రభుత్వం ఏమైనా చేసిందంటే.. భారీగా అప్పులు చేయడం తప్ప ఏమీ లేదని స్పష్టమవుతోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement