
నెల్లూరు: వైఎస్సార్సీపీ శ్రేణులే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం వేధింపులకు గురిచేస్తోంది. వైఎస్సార్సీపీ నేతలను, కార్యకర్తలను, పార్టీకి అండగా నిలిచే వారిపై రెడ్ బెక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తోంది. కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర్నుంచి సంక్షేమ పథకాల్ని గాలికొదిలేసి.. కేవలం కక్ష పూరిత రాజకీయాలను మాత్రమే చేస్తోంది కూటమి సర్కారు.
తాజాగా వైఎస్సార్ సీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డిపై రాజకీయ కక్ష సాధింపు చర్యలకు దిగింది ‘కూటమి’ ప్రభుత్వం. క్వార్జ్ అక్రమ రవాణా కేసులో కాకాణికి పోలీసులు నోటీసులు ఇవ్వడానికి ఆయన ఇంటికి వెళ్లారు. అయితే ఇంట్లో ఎవరూ లేకపోవడంతో కాకాణితో ఫోన్ లో మాట్లాడేందుకు పొదలకూరు పోలీసులు యత్నించిన తర్వాత ఆయన ఇంటికి నోటీసులు అంటించి వెళ్లారు. రేపు ఉదయం గం.11లకు రూరల్ డీఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.