ఏపీలో కొత్తగా 21,954  కరోనా కేసులు..

AP Government Released The Bulletin On Corona Virus - Sakshi

అమరావతి: గడిచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో 1,10,147 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 21,954  కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. అదే విధంగా, కరోనా కారణంగా 72 మంది మరణించారు. కాగా, గత 24 గంటల్లో ఈ మహమ్మారి బారినుండి 10,141 మంది  కొలుకున్నారు.  ఇప్పటి వరకు ఏపీ రాష్ట్రంలో మొత్తంగా.. 10 లక్షల 37 వేల 411 మంది కరోనా నుండి కోలుకుని  డిశ్చార్జ్‌ అయ్యారు.

ప్రస్తుతం 1,82,329 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్పటి వరకు ఏపీలో 1,70,60,446 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.  ఈమేరకు ఏపీ రాష్ట్రవైద్యారోగ్య శాఖ గురువారం కరోనాపై హెల్త్‌ బులెటిన్‌ను విడుదల చేసింది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top