ఈస్టర్ సందర్భంగా సీఎం జగన్‌ శుభాకాంక్షలు

AP CM YS Jagan Extends Easter Greetings - Sakshi

సాక్షి, అమరావతి: సత్యం పట్ల విశ్వాసానికి ఉన్న శక్తిని తెలిపిన మహిమాన్వితమైన రోజు ఈస్టర్ అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఈ పండుగ రోజు దేవుని దయతో అందరి హృదయాల్లో శాంతి, ఆనందాలు నిండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు సీఎం జగన్‌ ట్వీట్‌ చేశారు. 

ఈస్టర్‌ శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్‌
సాక్షి, హైదరాబాద్‌: క్రైస్తవులకు సీఎం కె.చంద్రశేఖర్‌ రావు ఈస్టర్‌ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. సాటి మనిషి కోసం ఏసుక్రీస్తు అనుసరించిన త్యాగనిరతిని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. క్రీస్తు అనుసరించిన ప్రేమ, దయ, శాంతి, సహనం, త్యాగం వంటి విలువలు, శత్రువునైనా ప్రేమించమనే ఆదర్శం సమస్త మానవాళికి అనుసరణీయమని పేర్కొన్నారు.   

చదవండి: (టెలీమెడిసిన్‌ సేవల్లో నంబర్‌వన్‌గా ఏపీ)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top