సాక్షి, అమరావతి: తాగు, సాగునీటి అవసరాలు లేనప్పటికీ.. కృష్ణా బోర్డు ఆదేశాలను తుంగలో తొక్కుతూ శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టుల్లో తెలంగాణ సర్కార్ 82.4 టీఎంసీలను అక్రమంగా వాడుకుని విద్యుదుత్పత్తి చేసిందని కృష్ణా బోర్డుకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఫిర్యాదు చేసింది. తెలంగాణ సర్కార్ అక్రమంగా వాడుకున్న నీటికిగానూ.. 66:34 నిష్పత్తిలో అదనంగా తమకు 160 టీఎంసీలను కేటాయించాలని ప్రతిపాదించింది. ఈ మేరకు కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి డీఎం రాయ్పురేకు ఏపీ ఇంజనీర్ ఇన్ చీఫ్ సి.నారాయణరెడ్డి శనివారం లేఖ రాశారు. శ్రీశైలం, నాగార్జునసాగర్ల్లో నీటిమట్టం కనీస స్థాయి దాటిందని వివరించారు. జూరాల, పులిచింతల ప్రాజెక్టుల గేట్లు ఎత్తేశారని తెలిపారు. ప్రకాశం బ్యారేజీ నుంచి వరద జలాలు సముద్రంలో కలుస్తున్నాయన్నారు. ఎగువ నుంచి 4 లక్షల క్యూసెక్కుల వరద వస్తున్న నేపథ్యంలో తాగు, సాగునీటి అవసరాలకు తక్షణమే ఏపీకి 27 టీఎంసీలు(చెన్నైకి తాగునీరు 3, తెలుగుగంగకు 7, ఎస్సార్బీసీ/గాలేరు–నగరికి 8, కేసీ కెనాల్కు 2, హంద్రీ–నీవాకు 7 టీఎంసీలు) విడుదల చేస్తూ ఉత్తర్వులివ్వాలని లేఖలో కోరారు.
లేఖలో ప్రధానాంశాలు..
► ప్రాజెక్టుల ఆపరేషనల్ ప్రోటోకాల్స్ను ఉల్లంఘించి శ్రీశైలం, సాగర్, పులిచింతల ప్రాజెక్టుల్లో తెలంగాణ అక్రమంగా విద్యుదుత్పత్తి చేస్తున్న అంశాన్ని అనేకసార్లు కృష్ణా బోర్డు దృష్టికి తీసుకొచ్చాం. విద్యుదుత్పత్తిని ఆపేయాలని బోర్డు ఇచ్చిన ఆదేశాలను తెలంగాణ తుంగలో తొక్కింది. విద్యుత్ ఉత్పత్తి చేస్తూ శ్రీశైలంలో 43.25, సాగర్లో 27.23, పులిచింతల ప్రాజెక్టులో 11.92 వెరసి 82.4 టీఎంసీలను తెలంగాణ అక్రమంగా వాడుకుంది. ఈ నీటిని ఆ రాష్ట్ర కోటా అయిన 299 టీఎంసీల్లో కలిపి లెక్కించాలి.
► ప్రస్తుతం శ్రీశైలంలో 853.7 అడుగుల్లో 88.47, సాగర్లో 536.5 అడుగుల్లో 181.11, పులిచింతలలో 173.71 అడుగుల్లో 43.79 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. ఎగువ నుంచి వరద వస్తున్న నేపథ్యంలో ఏపీకి 27 టీఎంసీలను విడుదల చేస్తూ ఉత్తర్వులివ్వాలి.
82.4 టీఎంసీలు తోడేసిన తెలంగాణ
Published Sun, Jul 25 2021 2:50 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
ఆర్టీసీ బస్సు– బైక్ ఢీ ●
వీడిన మహిళ హత్య కేసు మిస్టరీ
అంబేడ్కర్ కళాశాలలో దొడ్డమణి గోల్మాల్
తప్పక చదవండి
- ఓటమి భయంతో బరితెగిస్తున్న పచ్చమూకలు
- పారిస్ ఒలింపిక్స్కు భారత రిలే జట్లు అర్హత
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అందరివాడు జగన్ను ఆశీర్వదించండి
- పేదల అక్షరంపై కక్ష
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement